Bhumana Karunakar Reddy: దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ కేసును సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించండి..
- తిరుమలలోని పరకామణిలో చోరీ జరిగిందన్న మంత్రి నారా లోకేష్..
- దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ కేసును సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించండి..
- చంద్రబాబు హాయంలో జరిగిన దొంగతనం వీడియోలను బయట పెట్టాలి: భూమన కరుణాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: తిరుమలలోని పరకామణిలో చోరీ జరిగిందింటూ మంత్రి నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ కేసును సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. రవి కుమార్ కు తమిళనాడు, కర్ణాటక, ఏపీలో ఆస్తులు ఉన్నాయి.. తమకు, మా బినామీలకు కానీ ఆస్తులు రాయించి ఉంటే సీబీఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. టీటీడీ చరిత్రలో దొంగతనం చేస్తూ దొరికిన వ్యక్తి నుంచి ఆస్తులను టీటీడీ ఇప్పించిన ఘనత మాది.. కల్తీ నెయ్యి తరహాలోనే సీబీఐ విచారణకు ఈ కేసును ఇవ్వాలని భూమన తెలిపారు.
Read Also: EMRS Recruitment 2025: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 7,267 జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
అయితే, నా హాయంలో ఈ ఘటన జరిగిందే నిజమైతే నేను అలిపిరి దగ్గర నా తల నరుక్కుంటాను అని టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం తిరుమలను రాజకీయ అడ్డగా మార్చిందన్నారు. 2023లో రవి కూమార్ అనే ఉద్యోగి పరకామణిలో 800 డాలర్లు చోరీ చేస్తూ దొరికారు.. 20 సంవత్సరాలు అతను దొంగతనం చేస్తున్నట్లు గుర్తించి పట్టుకుంది వైసీపీ ప్రభుత్వం.. రవి కుమార్ ను పట్టుకున్న తరువాత వారి కుటుంబ సభ్యులందరూ పాప పరిహారంగా చేసిన తప్పుకు ప్రతిఫలంగా రూ. 14 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యు అయితే, బయట వందకోట్ల పైవా ఉన్న ఆస్తులను టీటీడీకి కానుక ఇచ్చారని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Solar Eclipse 2025: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. పలు దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం!
ఇక, ఆ ఆస్తులను తిరుమల తిరుపతి బోర్డులో తీర్మానం చేశారని భూమన చెప్పుకొచ్చారు. అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు.. విజిలెన్స్ వాళ్ళను బెదిరించి ఆ సీసీటీవీ వీడియోలను బయట పెట్టారు.. చంద్రబాబు హాయంలో జరిగిన దొంగతనం పైనా వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే గతంలో విచారణ జరిపిన విజిలెన్స్ నివేదికను ఇప్పుడు బయట పెట్టాలని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?