Andhra Pradesh: ఎన్నికల విధుల నుంచి టీచర్లు అవుట్.. మరి ఎవరు నిర్వహిస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తామని మంగళవారం ప్రకటించింది. బోధనేతర పనుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఇటీవల ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీచర్ల స్థానంలో ఎవరు విధులు నిర్వహిస్తారని అందరి మదిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత టీచర్లే గుర్తుకువచ్చేలా వారిని వినియోగించుకుంటున్నారు. ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్ వరకు టీచర్లే కనిపించేవారు. టీచర్లు లేని ఎన్నికల ప్రక్రియను ఊహించడం కష్టం.
Read Also: Pit Bull Dog: వీరంగం సృష్టించిన కుక్క.. ఫ్యామిలీతో యజమాని పరార్
Also Read
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
- OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
- OTR : మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు?
అయితే ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుండి టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడానికి ప్రధాన కారణమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ టీచర్లు జగన్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్నారు. సీపీఎస్ రద్దు, జీతాలు, ఆర్ధిక ప్రయోజనాలు, ఫేషియల్ అటెండెన్స్ వంటి అంశాలకు సంబంధించి గతంలో పలు మార్లు టీచర్లు తమ వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు. విజయవాడలో భారీ ధర్నా కూడా నిర్వహించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వాళ్లతో ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం తాజాగా వాళ్లను ఎన్నికల విధులకు దూరం చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Read Also: CM Jagan: జనంతోనే మాకు పొత్తు.. దుష్టచతుష్టయం దుష్ప్రచారాలు చేస్తోంది
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీచర్ల స్థానంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విధులు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం వాళ్లకు ప్రొబేషన్ ఇచ్చింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులుగా మారిపోయారు. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు విధులు అప్పగిస్తే టీచర్లు లేని లోటును భర్తీ చేయవచ్చని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
కాగా ప్రభుత్వ టీచర్లను ఎన్నికల విధులకు దూరం చేయడం అన్న నిర్ణయం వెనక ప్రభుత్వ పెద్దల దురాలోచన ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. టీచర్లు నిర్వహించే బోధనేతర పనుల్లో ఎన్నికల విధులు మాత్రమే ఉన్నాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎన్నెన్ని పనులు చేయిస్తున్నారని, మరి వాటి మాటేమిటని ప్రశ్నించారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా? ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/OB6zvCLDbC
— Lokesh Nara (@naralokesh) November 30, 2022
తాజావార్తలు
-
Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
-
Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Wonder: పొలంలో ఏడు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్న ఆవు.. అద్భుతమంటూ ఎగబడిన జనం..
-
NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?