Pit Bull Dog: వీరంగం సృష్టించిన కుక్క.. ఫ్యామిలీతో యజమాని పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pit Bull Dog Attacked A 12 Year Boy In Hubli: కర్ణాటకలోని హుబ్లీలో పిట్బుల్ జాతికి చెందిన ఓ కుక్క వీరంగం సృష్టించింది. ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఒకవేళ ఆ కుక్క నుంచి విడిపించకపోయి ఉంటే, ఆ కుక్క ఆ బాలుడి ప్రాణాలు తీసేది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. హుబ్లీ బంకాపుర చౌక్ వద్ద పాటిల్ గల్లీలో పవన్ అనిల్ దొడ్డమని (12) అనే బాలుడు ట్యూషన్కి వెళ్తున్నాడు. అదే సమయంలో.. గురుసిద్దప్ప చెన్నోజీ అనే వ్యక్తికి చెందిన పిట్బుల్ కుక్క కాంపౌండ్ వాల్ ఎగిరి, రోడ్డు మీదకు వచ్చింది. ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు.. ఆ కుక్క నుంచి బాలుడ్ని కాపాడారు. తీవ్రంగా గాయపడిన బాలుడ్ని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇంతలోనే ఆ కుక్క యజమాని గురుసిద్దప్ప చెన్నోజీ తన కుక్కని తీసుకొని, కుటుంబం సహా ఇల్లు విడిచి పారిపోయాడు. అతడు ఒక మాజీ కార్పొరేటర్ బంధువు అని తెలియడంతో.. ఆ లింక్ ద్వారా అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. పిట్బుల్ జాతి కుక్కలు ఉద్రేకమైనవి. ఏం చేయకుండానే అవి జనం మీద పడి కరుస్తాయి. అందుకే, భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయినప్పటికీ.. కొందరు దొంగచాటుగా వీటిని పెంచుకుంటున్నారు. చెన్నోజీ కూడా ఆ కోవకు చెందినవాడే. దీంతో, తనకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయంతో, ఆ ఘటన చోటు చేసుకున్న వెంటనే అతడు కంటికి కనిపించకుండా, కుటుంబం సహా పరారయ్యాడు. ఈ కుక్కల్ని ఇంతకుముందు అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. కానీ, భారత ప్రభుత్వం నిషేధం విధించినప్పటి నుంచి దిగుమతి ఆపేశారు.
Also Read
- Parliament Session: పార్లమెంట్లో నేడు కీలక బిల్లులు.. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుపై చర్చ.!
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
ఇదిలావుండగా.. హుబ్లీ, ధార్వాడ జంట నగరాలలో కుక్కల బెడద ఎక్కువ అయ్యిందని ఫిర్యాదులు అందుతున్నాయి. అక్కడి కిమ్స్ ఆసుపత్రల్లో కుక్క కాటుతో చేరుతున్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం ఐదారు మందికి పైగా కుక్కల బారినపడి కిమ్స్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. కుక్కల నియంత్రణకు తాము చర్యలు చేపడుతున్నామని కార్పొరేషన్ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీధర్ దండెప్పనవర చెప్పారు. ఆల్రెడీ టెండర్లు పిలిచామని.. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కుక్కలకు సంతాన రహిత ఆపరేషన్లను చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
-
Vivo X300e: వివో X300e విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్
-
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
-
Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
-
Raja Muthupandi: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్లిఫ్టింగ్లో రజతం గెలుచిన రాజా ముత్తుపాండి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!