Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి, కేవలం పబ్లిసిటీ కోసమే పాకులాడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంలో మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనివల్ల సుమారు మూడు లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రి తన పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో స్పోర్ట్స్ కోటా కింద అర్హత ఉన్నవారికి నేరుగా ఉద్యోగాలు లభించేవని, కానీ ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చాక జీవోలను సవరించి తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆరోపణలపై విచారణ జరిపించి క్లీన్ చిట్తో బయటకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రూ. 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు నిలిచిపోయాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- Mu*rder: బాలాపూర్లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ఊరేగింపులు చేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 15 వేల ఎకరాలు కావాలని చెప్పి కనీసం భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయారని గుర్తుచేశారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అన్ని రకాల క్లియరెన్సులు తీసుకువచ్చి పనులను వేగవంతం చేశామని తెలిపారు.
ఇక విజయనగరంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంపై పదేపదే మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాజభరణాలు పోయినా ఇంకా రాచరిక మనస్తత్వంతో మాట్లాడటం తగదన్నారు. మాన్సాస్ ట్రస్ట్లో అవకతవకలు ఉన్నాయని, దానిని ప్రభుత్వంలో కలపాలని గతంలో ఆనంద గజపతి రాజే లేఖ రాసిన విషయాన్ని అశోక్ గజపతి రాజు కాదనగలరా అని ప్రశ్నించారు. ఈ అంశాలపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కూటమి నేతలు చర్చకు రాగలరా అని బొత్స సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
-
Iran Commander: ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా చంపినా 30,000 డాలర్ల బహుమతి
-
Mu*rder: బాలాపూర్లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
-
Chennai Love Story OTT Release: హిట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
-
Donald Trump: కిమ్ జోంగ్ ఉన్తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?