Heavy Demand For Pulasa Fish: యానాంలో ఆ పులస చేపకు యమా డిమాండ్
పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుస్తెలమ్మి అయినా పులస చేప తినాలనేది గోదారోళ్ళ నానుడి. తాజాగా పులసచేపలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. యానాం లో గోదావరి పులస కి పుల్ డిమాండ్ తో వేలం పాట నిర్వహించారు. భారీవర్షాలు, గోదావరి వరదల కారణంగా ఈ మధ్య కాలం లో పులసలు దొరకక పోవడంతో తో పోటీ పడి వేలం పాట లో పాల్గొన్నారు పులస ప్రియులు. వేలం పాటలో చిన్నపులస చేప ఏకంగా 19 వేల రూపాయల రూపాయలు కి చిన్న పులస చేప అమ్మకం జరిగింది. ఈ పులస దొరికిన మత్స్యకారులు పండుగ చేసుకున్నారు. వేలంపాటలో భారీ ధరకు కొనుక్కున్న వ్యక్తి గర్వంగా పులసను తనతో తీసికెళ్లిపోయాడు.. అట్లుంటది మరి పులస చేపకు వున్న డిమాండ్. ఈ వేలం పాట వైరల్ అవుతోంది.
వర్షాకాలంలో మాత్రమే పులస చేప దొరుకుతుంది.. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురు ఈదుతూ వస్తుంది. అందుకే అటు ఉప్పగా, ఇటు తియ్యగా కమ్మగా వుంటుంది. పులస చేప పులుసు పెడితే లొట్టలేసుకుతింటారు. రాజకీయనేతల్ని ప్రసన్నం చేసుకోవడానికి పులసను ఆయుధంగా వాడతారు. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. సముద్రంలో ఉండే ఇలస.. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. పులస చేప కొనడానికి ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు.
ఈ చేపల రుచి చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం భోజన ప్రియులు తరలివస్తున్నారు. కాకినాడ, రాజమండ్రికి వచ్చే వారు అక్కడ పులస కొని పులుసు పెట్టుకుంటారు. హోటళ్ళవారు పులస చేపల పులుసు, ఇగురు వండి భోజన ప్రియులకు విందు చేస్తారు. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ చేపలమార్కెట్లు కిటకిటలాడుతుంటాయి. పులస పేరు చెప్పగానే గోదావరి జిల్లాల్లో నోరూరని వారుండరంటే ఆశ్చర్యమే. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేపకు తూర్పు గోదావరి జిల్లా ఎంతో ఫేమస్. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరిలో ఎర్రనీరు ఉన్నప్పుడే ఈ పులసలు ఎక్కువగా దొరుకుతాయి. అయితే వీటి ధర మాత్రం కాస్త ఎక్కువే. చిన్న సైజు చేప కొనాలంటే సుమారు నాలుగొందల నుంచి ఐదొందల వరకు ఉంటుంది. ఇక పెద్దసైజు చేప కొనాలంటే పదిహేనొందలు పెట్టాల్సిందే. దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది. తాజాగా చిన్న పులస చేపను 19 వేలకు కొన్నారంటే దీని వైభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Read Also: Viral News: లైంగిక సంతృప్తి కోసం వ్యక్తి దారుణం.. వాటర్ బాటిల్ దూర్చి..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో