Heavy Demand For Pulasa Fish: యానాంలో ఆ పులస చేపకు యమా డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుస్తెలమ్మి అయినా పులస చేప తినాలనేది గోదారోళ్ళ నానుడి. తాజాగా పులసచేపలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. యానాం లో గోదావరి పులస కి పుల్ డిమాండ్ తో వేలం పాట నిర్వహించారు. భారీవర్షాలు, గోదావరి వరదల కారణంగా ఈ మధ్య కాలం లో పులసలు దొరకక పోవడంతో తో పోటీ పడి వేలం పాట లో పాల్గొన్నారు పులస ప్రియులు. వేలం పాటలో చిన్నపులస చేప ఏకంగా 19 వేల రూపాయల రూపాయలు కి చిన్న పులస చేప అమ్మకం జరిగింది. ఈ పులస దొరికిన మత్స్యకారులు పండుగ చేసుకున్నారు. వేలంపాటలో భారీ ధరకు కొనుక్కున్న వ్యక్తి గర్వంగా పులసను తనతో తీసికెళ్లిపోయాడు.. అట్లుంటది మరి పులస చేపకు వున్న డిమాండ్. ఈ వేలం పాట వైరల్ అవుతోంది.
వర్షాకాలంలో మాత్రమే పులస చేప దొరుకుతుంది.. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురు ఈదుతూ వస్తుంది. అందుకే అటు ఉప్పగా, ఇటు తియ్యగా కమ్మగా వుంటుంది. పులస చేప పులుసు పెడితే లొట్టలేసుకుతింటారు. రాజకీయనేతల్ని ప్రసన్నం చేసుకోవడానికి పులసను ఆయుధంగా వాడతారు. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. సముద్రంలో ఉండే ఇలస.. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. పులస చేప కొనడానికి ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు.
ఈ చేపల రుచి చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం భోజన ప్రియులు తరలివస్తున్నారు. కాకినాడ, రాజమండ్రికి వచ్చే వారు అక్కడ పులస కొని పులుసు పెట్టుకుంటారు. హోటళ్ళవారు పులస చేపల పులుసు, ఇగురు వండి భోజన ప్రియులకు విందు చేస్తారు. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ చేపలమార్కెట్లు కిటకిటలాడుతుంటాయి. పులస పేరు చెప్పగానే గోదావరి జిల్లాల్లో నోరూరని వారుండరంటే ఆశ్చర్యమే. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేపకు తూర్పు గోదావరి జిల్లా ఎంతో ఫేమస్. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరిలో ఎర్రనీరు ఉన్నప్పుడే ఈ పులసలు ఎక్కువగా దొరుకుతాయి. అయితే వీటి ధర మాత్రం కాస్త ఎక్కువే. చిన్న సైజు చేప కొనాలంటే సుమారు నాలుగొందల నుంచి ఐదొందల వరకు ఉంటుంది. ఇక పెద్దసైజు చేప కొనాలంటే పదిహేనొందలు పెట్టాల్సిందే. దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది. తాజాగా చిన్న పులస చేపను 19 వేలకు కొన్నారంటే దీని వైభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Read Also: Viral News: లైంగిక సంతృప్తి కోసం వ్యక్తి దారుణం.. వాటర్ బాటిల్ దూర్చి..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!