Vishnuvardhan Reddy: ఏపీలో ఇకపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలుండవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆత్మకూరు ఉప-ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకున్న నేపథ్యంలో.. సత్తా చాటేందుకు వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము జనసేన – బీజేపీ బలపరిచిన అభ్యర్థిని రంగంలోకి దింపుతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం, టీడీపీల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 5 లక్షల ఆదాయమున్న దేవాలయాల హక్కు యాజమాన్యాలదే అని స్వయంగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు.. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయమని మంత్రి ఎలా అంటున్నారు? అంటూ ప్రశ్నించారు. దేవాలయ మంత్రిని మాట మాటలు చెప్పొద్దని మండిపడ్డ ఆయన.. మసీదులలో మౌజన్లకు డబ్బులు, పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నప్పుడు, దేవాలయాలపై ఎందుకు తేడా చూపిస్తున్నారని అడిగారు.
దేవాలయాలలో హుండీల లెక్కలు అడిగినట్టు.. ఇతర మతాలను ఎందుకు అడగరంటూ నిలదీశారు. బిజెపీ అధికారంలోకి వస్తే.. చర్చిలు, మసీదుల మాదిరిగా దేవాలయాలను స్వేచ్ఛగా ఉంచుతామని హామీ ఇచ్చారు. గ్రూప్ – 1 అభ్యర్ధుల ఇబ్బందులపై గవర్నర్కు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పెన్షన్లు, మంత్రులకు జీతాలు ఇవ్వడం తప్ప ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించిన ఆయన.. ఓట్లు కొనుక్కోవడానికే సీఎం జగన్ డబ్బులిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి అంటే ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకే పంచి ఓట్లు కొనుక్కోవడమా? అని నిలదీశారు.
Also Read
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- OTR : రావులపాలెంలో పేకాట శిబిరాలను గుట్టురట్టు చేసిన టీడీపీ అంతర్గత విబేధాలు
భూసేకరణ పేరుతో భూముల్ని వైసీపీ నేతలకు కట్టబెడుతున్నారని, అవినీతి యాప్ వైసీపీ నేతల అవినీతితోనే మొదలుపెట్టాలని విష్ణువర్ధన్ పేర్కొన్నారు. ఏపీలో తమ వాటా ఇవ్వలేక కేంద్ర నిధులు వద్దంటున్నారని, కర్నూలు మెడికల్ కళాశాల ఆస్తులను కూడా అమ్మేసే పరిస్ధితి తీసుకొచ్చారన్నారు. ఒకరినొకరు తిట్టుకోవడానికి బస్సు యాత్రం, మహానాడు కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అమలాపురం ఘటనపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదని, ఎమ్మెల్యేల మాటతీరుపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. ఇంజనీరుపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యేపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు షాడో ఎమ్మెల్యేలను పెట్టారని.. ఇకపై ఏపీలో టీడీపీ, వైసీపీ కుటుంబ ప్రభుత్వాలు ఉండవు విష్ణువర్ధన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..