YS Jagan: సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ.. ఇది ప్రభుత్వ వైఫల్యమే..!
- సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ..
- సింహాచలం ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం..
- 6రోజుల కిందట గోడ నిర్మాణం చేపట్టి 2 రోజుల కిందట పూర్తి చేశారు..
- చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా ?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: విశాఖ జిల్లా సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మధురవాడలోని చంద్రవరంకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడం విషాదాన్ని నింపింది.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. మృతదేహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన జగన్.. ఈ ఘటన దురదృష్టకరం అన్నారు.. అయితే, సింహాచలం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని విమర్శించారు.. ఆరు రోజుల కిందట గోడ నిర్మాణం చేపట్టి రెండు రోజుల కిందట పూర్తి చేశారు.. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా ? చందనోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు.. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఏడుగురిని బలిగొన్నారని మండిపడ్డారు.. నాడు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన, నేడు విశాఖలో సింహాచలం ఘటన భక్తుల ప్రాణాలు బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఘటనలు జరిగిన తర్వాత కమిషన్ వేస్తానంటారు.. కానీ, ఎవరిపైన చర్యలు ఉండవు.. ఎందుకంటే చంద్రబాబే దోషి కనుక అన్నారు..
Read Also: CM Revanth Reddy: తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది..!
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఘటన జరిగే ముందు ఉద్యోగాలు ఊడతాయని అధికారులు భయం ఉండాలి.. చంద్రబాబు తీసుకునేవి కంటి తుడుపు చర్యలు కనుక ఎవరికీ భయం లేదన్నారు వైఎస్ జగన్.. చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడడం ఆనవాయితీ.. వర్షం వస్తుందని తెలిసినా కూడా గోడ పక్కన భక్తులను ఎందుకు నిలబెట్టారు? అని ప్రశ్నించారు.. చందనోత్సవం కోసం వేసిన మంత్రుల కమిటీ ఏం చేస్తుంది..? సింహాచలం ఘటన ప్రభుత్వ తప్పిదమే అన్నారు.. ప్రభుత్వం బాధ్యత వహించి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి.. లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి రూపాయలకు మిగిలిన మొత్తాన్ని మేం ఇస్తాం అంటూ మృతుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!