Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- రుషికొండ భవనాల వినియోగంపై సర్కార్ కీలక నిర్ణయం..
- రుషికొండ భవనాలను లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు సిద్ధం..
- ఆపరేషన్ & మెయింటెనెన్స్ కోసం EOI కోరుతూ నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ భవనాలను లీజుకు కేటాయించాలని నిర్ణయించిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రుషికొండలో ఈ పర్యాటక భవనాలు నిర్మించబడ్డాయి. అయితే నిర్మాణాలపై రాజకీయ వివాదాలు, న్యాయపరమైన అంశాలు కొనసాగుతుండటంతో పాటు, రెండేళ్లుగా భవనాలు వినియోగంలో లేకపోవడంతో అవి దెబ్బతింటున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వంపై భారంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల దాదాపు రూ.25 లక్షలు వ్యయం అవుతోంది.
రుషికొండ భవనాల భవిష్యత్ వినియోగంపై అధ్యయనం చేసిన మంత్రి వర్గ ఉపసంఘం కీలక సూచనలు చేసింది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను లగ్జరీ రిసార్ట్గా అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం లీజు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా మరికొన్ని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పలువురు పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే రుషికొండ నిర్మాణాలకు సంబంధించి తీర ప్రాంత నియంత్రణ మండలి (CRZ) నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు, జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT), న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో అదనపు నిర్మాణాలకు అనుమతుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!