Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- రుషికొండ భవనాల వినియోగంపై సర్కార్ కీలక నిర్ణయం..
- రుషికొండ భవనాలను లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు సిద్ధం..
- ఆపరేషన్ & మెయింటెనెన్స్ కోసం EOI కోరుతూ నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ భవనాలను లీజుకు కేటాయించాలని నిర్ణయించిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రుషికొండలో ఈ పర్యాటక భవనాలు నిర్మించబడ్డాయి. అయితే నిర్మాణాలపై రాజకీయ వివాదాలు, న్యాయపరమైన అంశాలు కొనసాగుతుండటంతో పాటు, రెండేళ్లుగా భవనాలు వినియోగంలో లేకపోవడంతో అవి దెబ్బతింటున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వంపై భారంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల దాదాపు రూ.25 లక్షలు వ్యయం అవుతోంది.
రుషికొండ భవనాల భవిష్యత్ వినియోగంపై అధ్యయనం చేసిన మంత్రి వర్గ ఉపసంఘం కీలక సూచనలు చేసింది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను లగ్జరీ రిసార్ట్గా అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం లీజు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా మరికొన్ని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పలువురు పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే రుషికొండ నిర్మాణాలకు సంబంధించి తీర ప్రాంత నియంత్రణ మండలి (CRZ) నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు, జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT), న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో అదనపు నిర్మాణాలకు అనుమతుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
తాజావార్తలు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!