Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- రుషికొండ భవనాల వినియోగంపై సర్కార్ కీలక నిర్ణయం..
- రుషికొండ భవనాలను లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు సిద్ధం..
- ఆపరేషన్ & మెయింటెనెన్స్ కోసం EOI కోరుతూ నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ భవనాలను లీజుకు కేటాయించాలని నిర్ణయించిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రుషికొండలో ఈ పర్యాటక భవనాలు నిర్మించబడ్డాయి. అయితే నిర్మాణాలపై రాజకీయ వివాదాలు, న్యాయపరమైన అంశాలు కొనసాగుతుండటంతో పాటు, రెండేళ్లుగా భవనాలు వినియోగంలో లేకపోవడంతో అవి దెబ్బతింటున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వంపై భారంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల దాదాపు రూ.25 లక్షలు వ్యయం అవుతోంది.
రుషికొండ భవనాల భవిష్యత్ వినియోగంపై అధ్యయనం చేసిన మంత్రి వర్గ ఉపసంఘం కీలక సూచనలు చేసింది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను లగ్జరీ రిసార్ట్గా అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం లీజు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా మరికొన్ని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పలువురు పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే రుషికొండ నిర్మాణాలకు సంబంధించి తీర ప్రాంత నియంత్రణ మండలి (CRZ) నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు, జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT), న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో అదనపు నిర్మాణాలకు అనుమతుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!