Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Abdul Nazeer: విశాఖపట్నంలోని జేఎన్టీయూ–జీవీ క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి యువత కేవలం డిగ్రీలు సాధించడానికే పరిమితం కాకుండా, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని గవర్నర్ పేర్కొన్నారు. విద్యార్థులను ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడంలో అధ్యాపకులు, విద్యాసంస్థల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు.
జేఎన్టీయూ–జీవీ క్యాంపస్లో ఉన్నత విద్యా ప్రమాణాలతో బోధన కొనసాగుతోందని, విద్యార్థులకు అనుకూలమైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రశంసించారు. జల సంరక్షణ, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం ద్వారా యూనివర్సిటీని ‘నెట్ జీరో క్యాంపస్’గా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న కృషిని అభినందించారు. అలాగే, సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్స్గా హాస్టల్ భవనాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను స్వయంగా చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. జాతీయ విద్యా విధానం–2020 సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
తాజావార్తలు
-
Sai Razesh : ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నా!
-
Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
-
Akhilesh Yadav: ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారు.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!