INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Mahendragiri: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఆధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. బరాక్-8, బ్రహ్మోస్ క్షిపణులతో పాటు అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ నౌక భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేయనుంది. శత్రు రాడర్లకు చిక్కకుండా ప్రయాణించే సామర్థ్యం, జలాంతర్గాములను గుర్తించి నిర్వీర్యం చేసే వ్యవస్థలు దీనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, అధునాతన నౌకా నిర్మాణ రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. యుద్ధం కంటే ప్రపంచ శాంతికే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని, అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన సమాధానం ఇవ్వడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు.
మారిటైమ్ విజన్–2030, మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా నౌకా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు రాజ్నాథ్… ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి సముద్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి, భారతదేశాన్ని షిప్బిల్డింగ్, ఆవిష్కరణల రంగంలో అగ్రగామిగా నిలపడం లక్ష్యమని వివరించారు. ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి గా చేరిందన్న ఆయన.. సముద్ర రక్షణ లో విశాఖపట్నం ఒక బలమైన శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఏరో స్పేస్ రంగం అభివృద్ధి అవుతోంది.. ఫిఫ్త్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ టెక్నాలజీ అండర్ వాటర్ టార్పోడో అభివృద్ధి చేస్తున్నాం… కర్నూలు డ్రోన్ హబ్ అవుతుంది. ఆర్టిఫిషీయల్ ఇంటెల్ జెంట్స్ , న్యూ టెక్నాలజీ , అడ్వాన్స్ షిప్ తీసుకొస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీ తో, ఫుల్ సర్వ్ లెన్స్ తో సరికొత్త ఆధునిక యుద్ధ శక్తి తో ముందుకు వెళ్తున్నాం.. కొత్త పరిజ్ఞానం యుద్ధానికి మాత్రమే కాదు ఒకోసారి మరో దేశానికి సహకారంగా కూడా నిలుస్తాం అన్నారు.. యుద్ధం మా నినాదం కాదు .. శాంతి, సర్వ ప్రపంచ శాంతి మా విధానం. ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదు.. మన స్థిరత్వాన్ని బద్దలు కొడితే జరిగే పరిణామం చూపించాం అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్..
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
తాజావార్తలు
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
-
ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!