INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Mahendragiri: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఆధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. బరాక్-8, బ్రహ్మోస్ క్షిపణులతో పాటు అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ నౌక భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేయనుంది. శత్రు రాడర్లకు చిక్కకుండా ప్రయాణించే సామర్థ్యం, జలాంతర్గాములను గుర్తించి నిర్వీర్యం చేసే వ్యవస్థలు దీనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, అధునాతన నౌకా నిర్మాణ రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. యుద్ధం కంటే ప్రపంచ శాంతికే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని, అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన సమాధానం ఇవ్వడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు.
మారిటైమ్ విజన్–2030, మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా నౌకా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు రాజ్నాథ్… ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి సముద్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి, భారతదేశాన్ని షిప్బిల్డింగ్, ఆవిష్కరణల రంగంలో అగ్రగామిగా నిలపడం లక్ష్యమని వివరించారు. ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి గా చేరిందన్న ఆయన.. సముద్ర రక్షణ లో విశాఖపట్నం ఒక బలమైన శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఏరో స్పేస్ రంగం అభివృద్ధి అవుతోంది.. ఫిఫ్త్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ టెక్నాలజీ అండర్ వాటర్ టార్పోడో అభివృద్ధి చేస్తున్నాం… కర్నూలు డ్రోన్ హబ్ అవుతుంది. ఆర్టిఫిషీయల్ ఇంటెల్ జెంట్స్ , న్యూ టెక్నాలజీ , అడ్వాన్స్ షిప్ తీసుకొస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీ తో, ఫుల్ సర్వ్ లెన్స్ తో సరికొత్త ఆధునిక యుద్ధ శక్తి తో ముందుకు వెళ్తున్నాం.. కొత్త పరిజ్ఞానం యుద్ధానికి మాత్రమే కాదు ఒకోసారి మరో దేశానికి సహకారంగా కూడా నిలుస్తాం అన్నారు.. యుద్ధం మా నినాదం కాదు .. శాంతి, సర్వ ప్రపంచ శాంతి మా విధానం. ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదు.. మన స్థిరత్వాన్ని బద్దలు కొడితే జరిగే పరిణామం చూపించాం అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్..
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
తాజావార్తలు
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!