PM Modi: 8న విశాఖకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
- జనవరి 8న ప్రధాని మోడీ విశాఖ పర్యటన
- రైల్వే జోన్ కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన
- రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని.
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈనెల 8న మోడీ విశాఖకు రానున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్ పై దృష్టి పెట్టారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా వైజాగ్ వెళ్లి మరీ సమీక్ష నిర్వహించారు. మరోవైపు.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వైజాగ్లో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు
Read Also: Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ చిత్రంపై ‘కలర్ ఫొటో’ దర్శకుడు కీలక పోస్ట్..
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
ప్రధాని టూర్ విజయవంతం అయితే ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి మరికొంత సహాయం కోరే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పోలవరంతో పాటు రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్లు కేంద్రం నుంచి తీసుకు రావడం.. విభజన సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడడంపై కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వెనకబడిన జిల్లాలకు నిధులు మంజూరు, షెడ్యూల్ నైన్ అండ్ టెన్లో ఆస్తుల విభజన.. ఇలా కేంద్రం నుంచి పనులు జరగాల్సినవి ఉన్నాయి.
Read Also: Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్..
ఎన్డీయేలో భాగస్వాములుగా టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి ఉండడంతో కేంద్రం కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని టూర్ తర్వాత కేంద్ర బడ్జెట్ పెట్టె లోపు అవసరం అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి మరికొంత సహాయం అడిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రధాని టూర్పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. ఎన్డీయే ప్రభుత్వం ఆరు నెలల పాలన తర్వాత ప్రధాని మోడీ రావడంతో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!