CPI Narayana: రాజకీయాలలో స్పష్టమైన వైఖరి ఉండాలి.. దొంగాటలు ఆడకూడదు
- విశాఖ వేదికగా మూడు రోజుల పాటు సీపీఐ సమావేశాలు..
- విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తీర్మానం..
- అసెంబ్లీలో.. పార్లమెంట్ లో చట్టం ప్రకారమే ప్రతిపక్ష హోదా: నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ వేదికగా మూడు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరుగుతున్నాయి. తొలి రోజు సమావేశాలకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఇక, ఎన్నికల ఫలితాలపై సమీక్ష, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధి చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారు.. ప్రశ్నించే గొంతు నొక్కేశారు, రాజకీయ పార్టీల నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయలేదు.. అందుకే సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘోరంగా ఓడిపోయారు.. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి పర్యటనకు వచ్చిన చెట్లు నరికేసి పర్యావరణ విధ్వాంసానికి పాల్పడ్డారు అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.
Read Also: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం
Also Read
ఇక, న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వలనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రాజకీయాలలో స్పష్టమైన వైఖరి ఉండాలి.. దొంగాటలు ఆడకూడదు.. అసెంబ్లీలో, పార్లమెంట్ లో చట్టం ప్రకారమే ప్రతిపక్ష హోదా వస్తుంది.. గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండాలో నిర్మించిన భవనాలు చూడటానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదు.. నేను కోర్టు అనుమతితో నిర్మాణాలు పరిశీలించడానికి వెళ్ళాను.. విశాఖకు తలమానికమైన ఋషికొండాను వైసీపీ ప్రభుత్వం బొడిగుండు కొట్టేసింది.. నిజంగా టూరిజం కోసం అయితే ఋషికొండాలో అంత విలాసవంతమైన ప్యాలస్ ను నిర్మించాల్సిన అవసరం లేదని నారాయణ అన్నారు.
Read Also: Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే, అడవిలో 11 గంటలు ముప్పతిప్పలు పెట్టింది..
అయితే, తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఋషికొండాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. ఋషికొండాపై నిర్మాణాలకు పెట్టిన డబ్బులు పోలవరం ప్రాజెక్ట్ పై పెట్టివుంటే బాగుండేది.. జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.. ప్రజాధనంపై బాధ్యతారహితంగా వ్యవహరించారు.. తప్పక జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవించాల్సిందే అని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఋషికొండా భవనాలను ప్రజా ప్రయోజనాలు కోసం వినియోగించాలి అని నారాయణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..