Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే, అడవిలో 11 గంటలు ముప్పతిప్పలు పెట్టింది..
- గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ముప్పుతిప్పులు..
- 11 గంటల పాటు అడవిలో తప్పిపోయిన విద్యార్థులు..
- అతికష్టం మీద రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు-అటవీ శాఖ..
- ఒడిశాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps:ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ నమ్మకుంటే పలు ప్రమాదాలు ఎదురయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో నావిగేషన్ మ్యాప్ ఉపయోగించుకుంటూ వెళ్తే, ఏకంగా కారు నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు అదృష్టం కొద్దీ బతికారు.అంతకుముందు హైదరాబాద్కి చెందిన ఓ ఫ్యామిలీ ఇలాగే కేరళలో విహారయాత్రకు వెళ్తే ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
తాజాగా ఒడిశా రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. కటక్లోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సుజిత్య సాహు, సూర్య ప్రకాష్ మొహంతి, సుభాన్ మోహపాత్ర, హిమాన్షు దాస్ మరియు అరక్షితా మహపాత్ర బైక్లపై సప్తసజ్య ఆలయానికి బయలుదేరారు. కొండపై ఉన్న విష్ణుబాబా మఠంకి జూన్ 30 ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. తిరిగి వచ్చే క్రమంలో ఐదుగురు విద్యార్థులు దాదాపుగా దిక్కుతోచని పరిస్థితికి వెళ్లారు.
Also Read
Read Also: Deputy CM Pawan Kalyan: అన్నింటిపై ఆరా తీస్తున్న పవన్ కల్యాణ్..
నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్పై ఆధారపడటం వారు అడవి మధ్య 11 గంటల పాటు చిక్కుకుపోయారు. ఆలయానికి చేరుకున్న రోజు మధ్యాహ్నం 2 గంటల సమాచాని వారు నిస్సాహకులుగా మారారు. గూగుల్ మ్యాప్స్ వారిని సప్తసజ్య అడవిలో చాలా దూరం తీసుకెళ్లింది. అడవిలో చేరుకోలేని ప్రదేశానికి చేరుకోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
చాలా అలసిపోయి ఆహారం లేకుండా సాయంత్రం 5.30 గంటలకు భూషుని ఖోలాకు చేరుకున్నారు. ఈ ప్రాంతానికి సందర్శకులను నిషేధించారు. దీంతో వారి ఆందోళన మరింత పెరిగింది. అదే ప్రదేశంలో ఆగి, సహాయం కోసం ఎవరినైనా సంప్రదించడానికి ప్రయత్నించారు. చివరకు వారిలో ఒకరు పోలీసులను అతికష్టం మీద సంప్రదించగలిగారు. దెంకనల్ పోలీసులు, అటవీ శాఖ సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి విద్యార్థుల్ని కనుగొన్నారు. రెండు బృందాలు వీరి కోసం అడవిలో గాలించాయి.
‘‘ మేము ఆలయాన్ని సందర్శించాలనుకున్నాము. మేము ఆలయాన్ని అంచెలంచెలుగా దాటి కొండపైకి వచ్చాము మరియు అక్కడ ఒక సుందరమైన ప్రదేశం ఉందని గూగుల్ మ్యాప్స్ చెప్పింది. అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత, మాకు సబ్వేలు తప్ప సరైన మార్గం కనుగొనబడలేదు. మేము పొరపాటు చేసాము. సందర్శకులు నిషేధించబడిన భూషుని ఖోలాకు చేరుకున్నారు, మరియు బయటికి వెళ్లే మార్గం కనుగొనలేకపోయాము.’’ అని బాధితుల్లో ఒకరు చెప్పారు. దాదాపుగా 11 గంటల పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!