Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే, అడవిలో 11 గంటలు ముప్పతిప్పలు పెట్టింది..
- గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ముప్పుతిప్పులు..
- 11 గంటల పాటు అడవిలో తప్పిపోయిన విద్యార్థులు..
- అతికష్టం మీద రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు-అటవీ శాఖ..
- ఒడిశాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps:ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ నమ్మకుంటే పలు ప్రమాదాలు ఎదురయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో నావిగేషన్ మ్యాప్ ఉపయోగించుకుంటూ వెళ్తే, ఏకంగా కారు నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు అదృష్టం కొద్దీ బతికారు.అంతకుముందు హైదరాబాద్కి చెందిన ఓ ఫ్యామిలీ ఇలాగే కేరళలో విహారయాత్రకు వెళ్తే ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
తాజాగా ఒడిశా రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. కటక్లోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సుజిత్య సాహు, సూర్య ప్రకాష్ మొహంతి, సుభాన్ మోహపాత్ర, హిమాన్షు దాస్ మరియు అరక్షితా మహపాత్ర బైక్లపై సప్తసజ్య ఆలయానికి బయలుదేరారు. కొండపై ఉన్న విష్ణుబాబా మఠంకి జూన్ 30 ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. తిరిగి వచ్చే క్రమంలో ఐదుగురు విద్యార్థులు దాదాపుగా దిక్కుతోచని పరిస్థితికి వెళ్లారు.
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
Read Also: Deputy CM Pawan Kalyan: అన్నింటిపై ఆరా తీస్తున్న పవన్ కల్యాణ్..
నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్పై ఆధారపడటం వారు అడవి మధ్య 11 గంటల పాటు చిక్కుకుపోయారు. ఆలయానికి చేరుకున్న రోజు మధ్యాహ్నం 2 గంటల సమాచాని వారు నిస్సాహకులుగా మారారు. గూగుల్ మ్యాప్స్ వారిని సప్తసజ్య అడవిలో చాలా దూరం తీసుకెళ్లింది. అడవిలో చేరుకోలేని ప్రదేశానికి చేరుకోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
చాలా అలసిపోయి ఆహారం లేకుండా సాయంత్రం 5.30 గంటలకు భూషుని ఖోలాకు చేరుకున్నారు. ఈ ప్రాంతానికి సందర్శకులను నిషేధించారు. దీంతో వారి ఆందోళన మరింత పెరిగింది. అదే ప్రదేశంలో ఆగి, సహాయం కోసం ఎవరినైనా సంప్రదించడానికి ప్రయత్నించారు. చివరకు వారిలో ఒకరు పోలీసులను అతికష్టం మీద సంప్రదించగలిగారు. దెంకనల్ పోలీసులు, అటవీ శాఖ సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి విద్యార్థుల్ని కనుగొన్నారు. రెండు బృందాలు వీరి కోసం అడవిలో గాలించాయి.
‘‘ మేము ఆలయాన్ని సందర్శించాలనుకున్నాము. మేము ఆలయాన్ని అంచెలంచెలుగా దాటి కొండపైకి వచ్చాము మరియు అక్కడ ఒక సుందరమైన ప్రదేశం ఉందని గూగుల్ మ్యాప్స్ చెప్పింది. అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత, మాకు సబ్వేలు తప్ప సరైన మార్గం కనుగొనబడలేదు. మేము పొరపాటు చేసాము. సందర్శకులు నిషేధించబడిన భూషుని ఖోలాకు చేరుకున్నారు, మరియు బయటికి వెళ్లే మార్గం కనుగొనలేకపోయాము.’’ అని బాధితుల్లో ఒకరు చెప్పారు. దాదాపుగా 11 గంటల పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!