Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే, అడవిలో 11 గంటలు ముప్పతిప్పలు పెట్టింది..
- గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ముప్పుతిప్పులు..
- 11 గంటల పాటు అడవిలో తప్పిపోయిన విద్యార్థులు..
- అతికష్టం మీద రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు-అటవీ శాఖ..
- ఒడిశాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps:ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ నమ్మకుంటే పలు ప్రమాదాలు ఎదురయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో నావిగేషన్ మ్యాప్ ఉపయోగించుకుంటూ వెళ్తే, ఏకంగా కారు నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు అదృష్టం కొద్దీ బతికారు.అంతకుముందు హైదరాబాద్కి చెందిన ఓ ఫ్యామిలీ ఇలాగే కేరళలో విహారయాత్రకు వెళ్తే ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
తాజాగా ఒడిశా రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. కటక్లోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సుజిత్య సాహు, సూర్య ప్రకాష్ మొహంతి, సుభాన్ మోహపాత్ర, హిమాన్షు దాస్ మరియు అరక్షితా మహపాత్ర బైక్లపై సప్తసజ్య ఆలయానికి బయలుదేరారు. కొండపై ఉన్న విష్ణుబాబా మఠంకి జూన్ 30 ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. తిరిగి వచ్చే క్రమంలో ఐదుగురు విద్యార్థులు దాదాపుగా దిక్కుతోచని పరిస్థితికి వెళ్లారు.
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: Deputy CM Pawan Kalyan: అన్నింటిపై ఆరా తీస్తున్న పవన్ కల్యాణ్..
నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్పై ఆధారపడటం వారు అడవి మధ్య 11 గంటల పాటు చిక్కుకుపోయారు. ఆలయానికి చేరుకున్న రోజు మధ్యాహ్నం 2 గంటల సమాచాని వారు నిస్సాహకులుగా మారారు. గూగుల్ మ్యాప్స్ వారిని సప్తసజ్య అడవిలో చాలా దూరం తీసుకెళ్లింది. అడవిలో చేరుకోలేని ప్రదేశానికి చేరుకోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
చాలా అలసిపోయి ఆహారం లేకుండా సాయంత్రం 5.30 గంటలకు భూషుని ఖోలాకు చేరుకున్నారు. ఈ ప్రాంతానికి సందర్శకులను నిషేధించారు. దీంతో వారి ఆందోళన మరింత పెరిగింది. అదే ప్రదేశంలో ఆగి, సహాయం కోసం ఎవరినైనా సంప్రదించడానికి ప్రయత్నించారు. చివరకు వారిలో ఒకరు పోలీసులను అతికష్టం మీద సంప్రదించగలిగారు. దెంకనల్ పోలీసులు, అటవీ శాఖ సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి విద్యార్థుల్ని కనుగొన్నారు. రెండు బృందాలు వీరి కోసం అడవిలో గాలించాయి.
‘‘ మేము ఆలయాన్ని సందర్శించాలనుకున్నాము. మేము ఆలయాన్ని అంచెలంచెలుగా దాటి కొండపైకి వచ్చాము మరియు అక్కడ ఒక సుందరమైన ప్రదేశం ఉందని గూగుల్ మ్యాప్స్ చెప్పింది. అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత, మాకు సబ్వేలు తప్ప సరైన మార్గం కనుగొనబడలేదు. మేము పొరపాటు చేసాము. సందర్శకులు నిషేధించబడిన భూషుని ఖోలాకు చేరుకున్నారు, మరియు బయటికి వెళ్లే మార్గం కనుగొనలేకపోయాము.’’ అని బాధితుల్లో ఒకరు చెప్పారు. దాదాపుగా 11 గంటల పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!