Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pm Modi To Flag Off Nagpur Hyderabad Durg Visakhapatnam Vande Bharat Trains On September 16th

Vande Bharat: విశాఖకు ‘వందే భారత్‌’ రైళ్ల క్యూ.. ఎల్లుండి నుంచి మరో కొత్త సర్వీసు..

Published Date :September 14, 2024 , 2:01 pm
By Sudhakar Ravula
  • విశాఖకు వందేభారత్ రైళ్ల క్యూ..
  • ఎల్లుండి నుంచి మరో కొత్త సర్వీసు ప్రారంభం..
  • విశాఖ జంక్షన్ మీదుగా రోజూ 120 రైళ్లు రాకపోకలు..
  • వందేభారత్ ఎంట్రీతో విశాఖ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు..
  • 16న విశాఖ- దుర్గ్ జంక్షన్ మధ్య కొత్త రైలు ప్రారంభించనున్న మోడీ..
Vande Bharat: విశాఖకు ‘వందే భారత్‌’ రైళ్ల క్యూ.. ఎల్లుండి నుంచి మరో కొత్త సర్వీసు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vande Bharat: విశాఖకు “వందేభారత్” రైళ్లు క్యూ కడుతున్నాయి. ఎల్లుండి నుంచి మరో కొత్త సర్వీసు ప్రారంభంకాబోతోంది.. భారతీయ రైల్వేలలో వాల్టేర్ డివిజన్ ది ప్రత్యేక స్థానం. విశాఖ జంక్షన్ మీదుగా రోజూ 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో లక్ష దాటుతుంది. అదే సెలవులు, పర్వదినాల్లో అయితే ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు. అయితే, డిమాండ్ కు అనుగుణంగా రైళ్ల ఫ్రీక్వెన్ని వుండటం లేదనే విమర్శలు బలంగా వుండేవి. కానీ, వందేభారత్ ఎంట్రీ తర్వాత విశాఖ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు లభించింది… వివిధ గమ్యస్థానాలకు వెళ్లే సెమీ హైస్పీడ్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో వైజాగ్ నిలబడింది.

Read Also: Jonty Rhodes: నేను లోకల్, నాది గోవా.. జాంటీ రోడ్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈనెల 16న రెండు కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒకటి సికింద్రాబాద్ -నాగ్‌పూర్‌ మధ్య కాగా మరొకటి విశాఖ- దుర్గ్ జంక్షన్ మధ్య పరుగులు పెట్టనున్నాయి. వందే భారత్ నెట్‌వర్క్‌ విస్తరిస్తుండగా కొత్త సర్వీసులు రాకతో హైదరాబాద్‌కు ఐదు, విశాఖకు నాలుగుకు పెరిగినట్టు అవుతుంది. ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ కు రెండు.. భువనేశ్వర్ కు ఒకటి రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్త వందేభారత్ సేవలు ప్రారంభం అయితే నాలుగు రాజధాని నగరాలను కనెక్ట్ చేస్తూ నెట్‌వర్క్ విస్తరించినట్టు అవుతుంది. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ సిటీ దుర్గ్‌కు వెళ్లే వందేభారత్.. ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. ఒడిశా కేపిటల్ భువనేశ్వర్, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఇప్పటికే రెండు రైళ్లు ఉ న్నాయి.. సికింద్రాబాద్ వెళ్లే క్రమంలో విజయవాడ జంక్షన్ టచ్ చేస్తుండగా మొత్తం నాలుగు విశాఖ నుంచి.. నాలుగు రాష్ట్రాలను కలుపుతూ వందేభారత్ నెట్‌వర్క్ విస్తరించింది. ఈ స్ధాయిలో విశాఖకు ప్రాధాన్యత లభించడానికి విద్య, వైద్య, పారిశ్రామిక హబ్ కావడమేనని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Christina Joksimovich : మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య

కాస్మోపాలిటిన్ హంగులతో కనిపించే విశాఖ నగరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తుంటారు. ప్రధానంగా ఉత్తరాధి రాష్ట్రాల సంఖ్య ఎక్కువ. వీరందరికీ సౌలభ్యంగా వుండటంతో పా టు విశాఖకు పెరుగుతున్న ప్రాధాన్యత కూడా వందేభారత్ కేటాయింపులకు కారణం కానుంది. ఉత్త రాధి రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకుల నుంచి విశాఖ-దుర్గ్ వందేభారత్ కు మంచి ఆదరణ లభిస్తుందని వాల్టేర్ డివిజన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన మూడు వందే భారత్ రైళ్లలో విశాఖ-సికింద్రాబాద్ సర్వీసులు 100 శాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్నాయి. అదే భువనేశ్వర్ అయితే 80 శాతం ప్రయాణికులతో వెళ్తుంది.. ఈ సెమీ హైస్పీడ్ రైలులో ఛార్జీలు కొంచెం ఎక్కువే అయిన సరే ఆదరణ లభిస్తోంది. ఆత్యాధునిక టెక్నాలజీతో పాటు అనేక సౌకర్యాలు వుండటం ప్రయాణికుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో వందేభారత్ రైళ్లను అందుబాటులోకి వచ్చే అవకాశాలు వున్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Durg-Visakhapatnam
  • Nagpur-Hyderabad
  • PM Modi
  • telangana

తాజావార్తలు

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions