TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Mahanadu: మహానాడుకు భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ.. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది.. అయితే, తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణలో ఈసారి కీలక మార్పులు చేపట్టినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు.. ఇంధన వనరుల పొదుపును దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేసి, హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాస్, నెల్లూరులో మహానాడు కోసం ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
కోవిడ్ సమయంలో వర్చువల్ మహానాడును విజయవంతంగా నిర్వహించిన అనుభవం తమకు ఉందని ఆయన గుర్తు చేశారు పల్లా.. అదే తరహాలో ఈసారి సాంకేతికతను వినియోగిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాధారణంగా మహానాడు నిర్వహణకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని, దాదాపు 10 వేల వాహనాలు వివిధ ప్రాంతాల నుంచి వస్తాయని చెప్పారు. ఈ భారీ రవాణా వల్ల ఇంధన వినియోగం అధికమవుతుందని, అందుకే ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంచుకున్నామని పేర్కొన్నారు.
Also Read
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పల్లా శ్రీనివాస్.. ఇందుకోసం మొత్తం 1848 భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయ ప్రాంగణంలో 68 మంది సీనియర్ నేతలతో కూడిన ప్రత్యేక బృందం మహానాడు కార్యక్రమానికి దిశానిర్దేశం చేయనున్నట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!