Gudivada Amarnath: మా కార్పొరేటర్లపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు..
- జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు..
- బీసీ మహిళను విశాఖ మేయర్ పీఠం నుంచి దించడానికి ప్రయత్నం చేస్తున్నారు..
- వైసీపీ కార్పొరేటర్లపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నాం.. ఈ నెల 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎవరు పాల్గొనకూడదని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయేoదుకు సరిపడ బలం మాకు ఉంది.. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి అని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
Read Also: Minister Narayana: అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారు..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
ఇక, విశాఖ మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.. మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్ మేయర్ గా నాకు అవకాశం కల్పించారు.. బీసీ జనరల్ అయినా సరే యాదవ మహిళకు మేయర్ గా అవకాశం ఇచ్చారు.. యాదవులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారని పేర్కొన్నారు. యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్లు స్థలాన్ని కేటాయించారు.. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు.. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించింది. యాదవుల కన్నీరు మంచిది కాదంటూ గతంలో ఎమ్మెల్యే వంశీ చెప్పారు.. ఇప్పుడు యాదవుల కన్నీరు వంశీకి కనిపించడం లేదా అని క్వశ్చన్ చేసింది. సోదర సమానులైన పల్లా శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసం అపి హరి వెంకట కుమారి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!