MLC Botsa Satyanarayana: లడ్డూ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకండి.. విచారణ జరిపి చర్యలు తీసుకోండి..
- తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకండి..
- రాజకీయ పార్టీలు.. మీడియాకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి..
- విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Botsa Satyanarayana: వివాదంగా మారిన తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకాలని రాజకీయ పార్టీలను, మీడియాకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేయడం.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అభ్యంతరకరం అన్నారు.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. అధికారంలో వున్న వాళ్లు విచారించి వాస్తవాలు బయట పెట్టాలి.. కానీ, ఆరోపణలు చేయడం సరైనది కాదు అన్నారు.. దేవుడితో రాజకీయాలు ఎవరు చేసిన తప్పే.. ఆరోపణలు చేస్తున్న వాళ్లు మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలన్నారు..
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇక, వెజిటేబుల్ ఫ్యాట్ కలిసి నెయ్యిని ప్రసాదాలు తయారీకి వాడలేదని ఈవో చెబుతున్నారు.. కూటమి పార్టీలు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు బొత్స.. టీటీడీ తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడితే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించడం సాధారణ ప్రక్రియ.. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలోనూ పలు మార్లు ట్యాంకర్లు వెనక్కు పంపించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.. శాంతి భద్రతలు, 100రోజుల అభివృద్ధిపై జరగాల్సిన చర్చ.. భక్తుల మనోభావాలతో ముడిపడిన లడ్డూ చుట్టూ తిప్పడం అన్యాయం అన్నారు.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిన బడ్జెట్ ఎందుకు పెట్టలేదు..? టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో జరిగిన అప్పులుపై వివరాలు బహిర్గతం చేయండి అని డిమాండ్ చేశారు..
Read Also: Devara : జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.
మరోవైపు.. సంక్షేమ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు అని విమర్శించారు ఎమ్మెల్సీ బొత్స.. వరదల కారణంగా చనిపోయిన వాళ్ల లెక్కలు చెప్పమంటే.. ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం కోసం బోట్లు పంపించారని మాట్లాడుతున్నారు.. బోట్లు వ్యవహారంలో వాస్తవాలు మీ అంతరాత్మకు తెలియదా…? అని ప్రశ్నించారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం.. కానీ, ప్రభుత్వ అసమర్థత కారణంగా చనిపోవడం మన రాష్ట్రంలోనే చూశాం అన్నారు.. నెయ్యిని ప్రసాదాల్లో వాడలేదని ఈవో చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు.. స్వామి వారి ప్రసాదాల్లో అపచారం జరుగుతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. లేని పక్షంలో ఆరోపణలు చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.. కూటమిలో వున్న బీజేపీ కూడా ఆ దిశగా ఆలోచించాలి.. లడ్డూ ప్రసాదాలను సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
-
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!