Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం..
- కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం
- కస్టడీలో కీలక సమాచారం రాబట్టిన భీమిలీ పోలీసులు
- జమీమాతో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఫోకస్
- కీలకంగా మారిన ల్యాప్ టాప్.. హార్డ్ డిస్క్ లోని డేటా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిలాడీ లేడీ జాయ్ జెమిమా హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేమిమాను కస్టడీలో తీసుకున్న భీమిలీ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. జమీమాతో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సీపీ.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్లోని డేటా కీలకంగా మారింది. అయితే.. తెలివిగా ముందే మొబైల్లోని కీలక డేటాను ల్యాప్ టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది కిలేడి. ఈ క్రమంలో.. ఫోన్ పే వంటి నగదు ట్రాన్సాక్షన్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా.. పోలీసుల వద్ద కిలేడీ ఏడుస్తూ తననే మోసగించారని డ్రామాలు చేసింది. అయితే.. ఈ కిలేడీ లేడీ ట్రాప్ చేసి పలువురి దగ్గర నుండి లక్షలు కాజేసింది. ఫోటో షూట్ల కోసం, రీల్స్ కోసం ఓ టీమ్ను ఏర్పాటు చేసుకుంది జాయ్ జెమిమా. కాగ.. ఈ కేసులో మరోసారి మహిళను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.
Read Also: Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్గేట్స్ నివాళి..
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
మాయ లేడీ జాయ్ జేమియా.. 10 నెలల కిందటే ఈ ఏడాది జనవరిలో వ్యాపారవేత్త బీన్ బోర్డ్ డైరెక్టర్ ఎడ్ల ఐజాక్ జెరేమియను హాని ట్రాప్ చేసి.. రేప్ కేసు పెట్టించింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో దీనిపై FIR నమోదు చేశారు. ఆ సమయంలో జేమియ మోసాలను గుర్తించలేకపోయిన పోలీసులు.. అప్పుడు విచారణ లేకుండానే బాధితుడిపై రేప్ కేసు నమోదు చేశారు. అయితే.. అదే వ్యక్తి హాని ట్రాప్కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. అసలు బండారం బయటపడింది. ఇలా చాలా మందిని ట్రాప్ చేసిన కిలేడీ.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేది. ఈ క్రమంలో.. అమెరికాలో ఉంటున్న విశాఖకు చెందిన మురళీ అనే వ్యక్తిని మాయ మాటలు చెప్పి డబ్బులు కాజేసింది. పెళ్లి చేసుకోవాలని బెదిరించేది.. లేదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేది. ఈ క్రమంలో.. ఈ నెల 4వ తేదీన బాధిత యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించి అసలు విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు మురళీనగర్ లో జెమీమాను అదుపులోకి తీసుకుని.. ఆమె నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, మూడు ఫోన్లు, కారు సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు.
Read Also: CPI Narayana: జగన్ పై ఉన్న కోపాన్ని లడ్డూపై చూపించారు.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!