Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్గేట్స్ నివాళి..
- రతన్ టాటా మరణం ప్రపంచానికి నష్టం..
- ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తి..
- మానవాళికి ఆయన సేవ నన్ను కదిలించింది..
- టాటాకి నివాళులు అర్పించిన బిల్ గేట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates tribute to Ratan Tata: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశంపై, ప్రపంచంపై చెరగని ముద్రవేసింది’’ అని లింక్డ్ఇన్ పోస్టులో అన్నారు. తాను రతన్ టాటాని అనేక సందర్భాల్లో కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా ఉద్దేశ్యం, మానవాళికి చేసే సేవ నన్ను ఎప్పుడూ కదిలించాయని అన్నారు. అనేక కార్యక్రమాల్లో టాటాతో కలిసి పనిచేయడాన్ని గుర్తు చేసుకున్నారు. అతడి వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తుందని చెప్పారు.
Read Also: Mohammed Siraj: డీఎస్పీగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరణ..
Also Read
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
“రతన్ టాటా ఒక దార్శనిక నాయకుడు, జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశం మరియు ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. నేను అనేక సందర్భాల్లో అతనిని కలిసే అవకాశం దక్కింది. అతని ఉద్దేశ్యం మరియు మానవాళికి సేవ చేయాలనే బలమైన భావనతో నన్ను ఎల్లప్పుడూ కదిలించాయి’’ అని రతన్ టాటాతో ఉన్న ఫోటోని బిల్ గేట్స్ పోస్ట్ చేశారు. రతన్ టాటా మృతి రాబోయే కాలంలో ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది, అయితే అతను వదిలివెళ్లిన వారసత్వం, అతను సెట్ చేసిన మార్గదర్శకాలు తదుపరి తరాలకు స్పూర్తినిస్తాయని అన్నారు.
గత ఏడాది మార్చిలో రతన్ టాటాని బిల్ గేట్స్ అతని భారత పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరువురు దాతృత్వం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆరోగ్యం, రోగనిర్ధారణ, పోషకాహారం వంటి అంశాలపై భాగస్వామ్యం గురించి చర్చించారు. భారత పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు. అతడి మృతిపై రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల వరకు అందర్ని శోకసంద్రంలో ముంచింది. భారత ప్రజలు ఒక రత్నాన్ని కోల్పోయామని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!