Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్గేట్స్ నివాళి..
- రతన్ టాటా మరణం ప్రపంచానికి నష్టం..
- ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తి..
- మానవాళికి ఆయన సేవ నన్ను కదిలించింది..
- టాటాకి నివాళులు అర్పించిన బిల్ గేట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates tribute to Ratan Tata: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశంపై, ప్రపంచంపై చెరగని ముద్రవేసింది’’ అని లింక్డ్ఇన్ పోస్టులో అన్నారు. తాను రతన్ టాటాని అనేక సందర్భాల్లో కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా ఉద్దేశ్యం, మానవాళికి చేసే సేవ నన్ను ఎప్పుడూ కదిలించాయని అన్నారు. అనేక కార్యక్రమాల్లో టాటాతో కలిసి పనిచేయడాన్ని గుర్తు చేసుకున్నారు. అతడి వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తుందని చెప్పారు.
Read Also: Mohammed Siraj: డీఎస్పీగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరణ..
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
“రతన్ టాటా ఒక దార్శనిక నాయకుడు, జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశం మరియు ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. నేను అనేక సందర్భాల్లో అతనిని కలిసే అవకాశం దక్కింది. అతని ఉద్దేశ్యం మరియు మానవాళికి సేవ చేయాలనే బలమైన భావనతో నన్ను ఎల్లప్పుడూ కదిలించాయి’’ అని రతన్ టాటాతో ఉన్న ఫోటోని బిల్ గేట్స్ పోస్ట్ చేశారు. రతన్ టాటా మృతి రాబోయే కాలంలో ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది, అయితే అతను వదిలివెళ్లిన వారసత్వం, అతను సెట్ చేసిన మార్గదర్శకాలు తదుపరి తరాలకు స్పూర్తినిస్తాయని అన్నారు.
గత ఏడాది మార్చిలో రతన్ టాటాని బిల్ గేట్స్ అతని భారత పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరువురు దాతృత్వం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆరోగ్యం, రోగనిర్ధారణ, పోషకాహారం వంటి అంశాలపై భాగస్వామ్యం గురించి చర్చించారు. భారత పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు. అతడి మృతిపై రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల వరకు అందర్ని శోకసంద్రంలో ముంచింది. భారత ప్రజలు ఒక రత్నాన్ని కోల్పోయామని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!