Visakhapatnam: విశాఖ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..!
- పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో కేరాఫ్ అడ్రస్గా విశాఖ..
- ఉమ్మడి విశాఖ జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉమ్మడి విశాఖ జిల్లా కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. విస్తృతమైన కనెక్టివిటీ, భౌగోళిక సానుకూలత, మానవ వనరుల లభ్యత మేజర్ అడ్వాంటేజ్. ఇప్పటికే ఉన్న ఇండస్ట్రీస్ ఒక ఎత్తైతే.. ఫార్మా, గార్మెంట్, పెట్రోలియం అనుబంధ రంగాల పెట్టుబడులు విస్తృతమైన తర్వాత ఆసక్తి ఎక్కువైంది. అచ్యుతాపురం, పరవాడలో ఫార్మా పెట్టుబడులు రాగా వందల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. భవిష్యత్తులో పెట్టుబడులకు విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కీలకమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే మిట్టల్ స్టీల్ వంటి పరిశ్రమలు ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారు. పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం జనాల్లో ఉంది.
Read Also: America: తెల్లవారుజామున కారుకు ఎదురు వచ్చిన వింత జీవి.. ఉలిక్క పడ్డ డ్రైవర్
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ కుంపటిని రాజేసింది. టీడీపీకి గట్టిపట్టున్న మత్స్యకార గ్రామం రాజయ్యపేటలో జనం ఎదురుతిరగడం, అనితను అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మత్స్యకారుల ఆందోళనలకు మద్దతుగా నిలిచాయి. బల్క్ డ్రగ్ పార్క్ పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా ఐదేళ్ళ కార్మిక పోరాటం ఇంకా కొలిక్కి రాలేదు. విశాఖ ఉక్కుకు వచ్చిన ముప్పేమీ లేదని కూటమి స్పష్టం చేస్తోంది. అయినా, విశాఖ ఉక్కు- తెలుగోడి హక్కు నినాదం నిత్యం రగులుతూనే వుంది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలనే డిమాండ్ ఎమ్మెల్యేలకు నిత్యం ఒత్తిడికి గురిచేస్తోంది. అలా ఎదుర్కొంటున్న వారిలో పల్లా శ్రీనివాస్ ముందు ఉన్నారు.
అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం పెదగంట్యాడలో తలపెట్టిన గంగవరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ చుట్టూ వ్యతిరేకత ముసురుకుంటోంది. 20 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసింది. ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. దీనికి వేయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని పేర్కొంది. ఈ నెల 8న పబ్లిక్ హియరింగ్ జరగనుండగా జనావాసాల మధ్య సిమెంట్ పరిశ్రమ ఏర్పా టు ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. పారిశ్రామిక అభివృద్ధి ఎవరు కాదనలేనిది. కానీ, రెడ్ జోన్ ఇండస్ట్రీస్ కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలు ప్రశ్నార్ధకంగా మారుతోంది. అందుకే జనంలో ఇంత వ్యతిరేకత వస్తుందంటున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!