Central Cabinet Decisions: ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వేజోన్కు ఆమోదం
- ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త
- విశాఖ రైల్వేజోన్కు కేంద్రం ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీరింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విశాఖ రైల్వేజోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. వాల్తేర్ డివిజన్ను విశాఖపట్నం రైల్వే డివిజన్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి..దీనిని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. స్కిల్ ఇండియా కోసం రూ.8,800 కోట్లు, పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0కి రూ.6000 కోట్లు, జన్ శిక్షణ్ సంస్థాన్కు రూ.858 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Brazil: బ్రెజిల్లో బస్సును ఢీకొట్టిన చిన్న విమానం.. ఇద్దరు మృతి
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
స్కిల్ ఇండియా కార్యక్రమానికి మరో రూ.8,800 కోట్లు కేటాయించిదని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘‘ఈ కార్యక్రమాలు నిర్మాణాత్మక నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, సమాజ ఆధారిత అభ్యాసాన్ని అందించడం, అట్టడుగు వర్గాలతో సహా పట్టణ మరియు గ్రామీణ జనాభా రెండింటికీ అధిక నాణ్యత వృత్తి విద్యను పొందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: India Alliance: ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇండియా కూటమి పరిస్థితి ఏంటి?
అలాగే కొత్త ఐటీ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆరు దశాబ్దాల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించిందని వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల మొదటి దశ ఫిబ్రవరి 13న ముగుస్తుంది. ఈ సమావేశాలు మార్చి 10న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!