Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Andhra Pradesh Government Cancelled Land Allotment To Hayagriva In Vizag

Hayagriva Land: ‘హయగ్రీవ’ భూములపై సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం..

Published Date :March 11, 2025 , 9:04 am
By Sudhakar Ravula
  • పగిలిన హయగ్రీవ ఫార్మ్ అండ్‌ విల్లాస్ అక్రమాలు..
  • వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు..
Hayagriva Land: ‘హయగ్రీవ’ భూములపై సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hayagriva Land: ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్‌ విల్లాస్ అక్రమాలు పుట్ట పగిలింది. వృద్ధులు, అనాథల పేరుతో తక్కువ ధరకు భూములు తీసుకుని వేల కోట్లు వ్యాపారం చేసిన రియల్టర్లుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నగరంలో అత్యంత వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ, హయగ్రీవ సంస్థకు ఝలక్ తగిలింది. విశాఖపట్నం జిల్లా ఎండాడగ్రామం సర్వే నంబర్ 92/3 లో 12.50 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని 2008 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయగ్రీవ ఫార్మ్ అండ్‌ విల్లాస్ సంస్థకు కేటాయించింది. చిలుకూరి జగదేశ్వరుడికి చెందిన ఈ సంస్థకు 2008 డిసెంబర్ ఆరవ తేదీన అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10 శాతం శాతం స్థలంలో అనాదాశ్రమం, వృద్ధాశ్రమం ఏర్పాటు, మిగతా 90 శాతంలో  వయోవృద్ధులకు మాత్రమే గృహ నిర్మాణాలు చేసి విక్రయించే నిబంధనలతో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయింపులు జరిగాయి.

Read Also: Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై అమృత సంచలన పోస్ట్..

అయితే, సకాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో హయగ్రీవ సంస్థ విఫలం కావడంతో రెవిన్యూ అధికారులు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని 2018లో  వెనక్కు తీసుకున్నారు. దీనిపై హయగ్రీవ సంస్థ కోర్టులో సవాల్ చేయగా మూడేళ్లలో ప్రభుత్వం కేటాయించిన ప్రతిపాదిత ప్రాజెక్టు అనగా 10 శాతంలో అనాధ, వృద్దాశ్రమాన్ని మూడేళ్ల నిర్మాణం చేసి 90శాతంలో వయోవృద్ధులకు గృహ నిర్మాణా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ భూమితో హయగ్రీవ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. లోప భూయిష్టమైన ఒప్పందాలను అడ్డుగా పెట్టుకుని భూముల్ని అమ్మడం ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే 16 సేల్ అగ్రిమెంట్లు, 15 సేల్ డీడ్లు చేశారని గుర్తించి 2022 మే, జూలైలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ., ఆడిటర్.. వైసీపీ నేత గన్నమని వెంకటేశ్వరరావు ఎంట్రీతో ఈ లావాదేవీలు వేగవంతం అయ్యాయి. ఆశ్రమం నిర్మాణం చేస్తూనే విల్లాలను అమ్ముకుని వేలకోట్లు కొట్టేశారనేది ప్రధాన అభ్యంతరం.

Read Also: PM Modi: నేటి నుంచి రెండ్రోజులు మారిషస్‌‌లో మోడీ పర్యటన

ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీ, జీవీలు కలిసి తమ సంతకాలను ఫోర్జరీ చేయటంతో పాటు కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకుని, వాటి ఆధారంగా ప్రభుత్వం నుంచి తాను పొందిన భూమిని కబ్జాచేసి వారి ఆధీనంలోకి తీసుకున్నారని హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ భాగస్వామిగా ఉన్న చిలుకూరి జగదీష్ ఆరిలోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కబ్జాపై గట్టిగా ప్రశ్నించినందుకు తనపై బెదిరింపులకు దిగారని  ఫిర్యాదులో పేర్కొన్న జగదీశ్ బలవంతంగా తనను తన భార్య రాధా రాణిని బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ ఆధారంగా బ్రహ్మాజీ, జీవీ, ఎంవీవీ సత్య నారాయణ లపై 10 సెక్షన్ల కింద అరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ MVV ఇంట్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Government
  • AP Govt Cancelled
  • Hayagriva land
  • Vizag

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions