Vallabhaneni Vamsi Mohan: రంగంలోకి ప్రత్యేక బృందాలు.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్..
- మాజీ ఎమ్మెల్యే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్కు రంగం సిద్ధం..
- ఏ క్షణంలోనైనా వల్లభనేనిని అరెస్ట్ చేసే అవకాశం..
- వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు..
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వంశీ..
Vallabhaneni Vamsi Mohan: మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, వంశీ హైదరాబాద్ వెళ్లిపోయారట.. గత నెలలోనే వంశీ హైదరాబాద్కు వెళ్లినట్టుగా చెబుతున్నారు.. తాజాగా వంశీని పట్టుకోవటం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు..
Read Also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్కు భారీగా పెరిగిన వరద ఉధృతి.. 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
కాగా, టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన వల్లభనేని వంశీ.. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. అయితే 2019 ఎన్నికల్లో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైర్ బ్రాండ్ స్వరం క్రమంగా మారుతూ వచ్చింది.. వైసీపీ మద్దతుదారుగా మారిపోయిన ఆయన.. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. టీడీపీపై.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీపై వ్యక్తిగ విమర్శలు చేయడం పెద్ద రచ్చగా మారిన విషయం విదితమే.. మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. ఈ దాడి ఘటనలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!