Srisailam Dam: శ్రీశైలం డ్యామ్కు భారీగా పెరిగిన వరద ఉధృతి.. 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత..
- శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతోన్న వరద ఉధృతి..
- 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..
- డ్యామ్ లో ఇన్ ఫ్లో రూపంలో వచ్చి చేరుతోన్న 482401 క్యూసెక్కుల నీరు..
- 10 గేట్లు 20 ఫీట్ల అడుగుల మేర ఎత్తి నీటి విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam: కృష్ణా నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి.. ఓవైపు జూరాల.. మరోవైపు తుంగభద్ర నుంచి వరద పోటెత్తడంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది.. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉధృతి పేరుగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యామ్కు ఇన్ ఫ్లో రూపంలో 4,82,401 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 10 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తంగా 5,28,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 207.4100 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Read Also: Paris Olympic: ఒలింపిక్స్ లో భారీ మోసం..అర్హత లేని బాక్సర్ ను బరిలోకి దింపిన వైనం
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
మరోవైపు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తాకింది నీటిమట్టం.. 545.80 అడుగులకు నీటిమట్టం చేరడంతో క్రస్ట్ గేట్లను తాకింది కృష్ణమ్మ.. జులై 23వ తేదీన 503 అడుగుల వద్ద.. 120.89 టీఎంసీల వద్ద సాగర్ నీటిమట్టం ఉంది.. తాజాగా 546 అడుగుల వద్ద.. 198 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. పది రోజుల్లో 43 అడుగుల నీటిమట్టం పెరగగా.. 78 టీఎంసీల నీరు వచ్చి చేరింది.. గడచిన 48 గంటల్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరిన 50 టీఎంసీల నీరు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!