Srisailam Dam: శ్రీశైలం డ్యామ్కు భారీగా పెరిగిన వరద ఉధృతి.. 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత..
- శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతోన్న వరద ఉధృతి..
- 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..
- డ్యామ్ లో ఇన్ ఫ్లో రూపంలో వచ్చి చేరుతోన్న 482401 క్యూసెక్కుల నీరు..
- 10 గేట్లు 20 ఫీట్ల అడుగుల మేర ఎత్తి నీటి విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam: కృష్ణా నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి.. ఓవైపు జూరాల.. మరోవైపు తుంగభద్ర నుంచి వరద పోటెత్తడంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది.. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉధృతి పేరుగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యామ్కు ఇన్ ఫ్లో రూపంలో 4,82,401 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 10 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తంగా 5,28,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 207.4100 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Read Also: Paris Olympic: ఒలింపిక్స్ లో భారీ మోసం..అర్హత లేని బాక్సర్ ను బరిలోకి దింపిన వైనం
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
మరోవైపు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తాకింది నీటిమట్టం.. 545.80 అడుగులకు నీటిమట్టం చేరడంతో క్రస్ట్ గేట్లను తాకింది కృష్ణమ్మ.. జులై 23వ తేదీన 503 అడుగుల వద్ద.. 120.89 టీఎంసీల వద్ద సాగర్ నీటిమట్టం ఉంది.. తాజాగా 546 అడుగుల వద్ద.. 198 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. పది రోజుల్లో 43 అడుగుల నీటిమట్టం పెరగగా.. 78 టీఎంసీల నీరు వచ్చి చేరింది.. గడచిన 48 గంటల్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరిన 50 టీఎంసీల నీరు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!