MP Purandeswari: బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..
- కొల్లం గంగిరెడ్డి వ్యవహారంపై స్పందించిన పురంధేశ్వరి..
- గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమే..
- ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడుతాం..
- జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటామన్న ఏపీ బీజేపీ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Purandeswari: అంతర్జాతీయ రెడ్ శాండల్ స్మగర్గా పేరున్న కొల్లం గంగిరెడ్డి.. చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారనే వ్యవహారం.. బీజేపీలో వివాదాస్పదంగా మారందని.. కొందరు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి.. జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటాం.. ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలన్నారు. ఇక, వైసీపీ నుంచి కొంతమంది బీజేపీలోకి వస్తున్నారనేది ప్రచారం మాత్రమే.. చర్చల దశలోనే ఆ వ్యవహారాలు ఉన్నాయన్నారు..
Read Also: Chiranjeevi – Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. ఒకే వేదికపై చిరు, బన్నీ?
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి, ఎవరైనా బీజేపీలోకి వస్తానంటే ఆలోచిస్తాం.. వచ్చినవారు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు పురంధేశ్వరి.. ఎవరు పార్టీలో చేరినా, ముందు జిల్లా కార్యవర్గంతో చర్చించాలి, జిల్లా కార్యవర్గం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటామని తెలిపారు.. మరోవైపు.. మా కార్యకర్తలు, నాయకులు, నామినేటెడ్ పదవులు ఆశించడంలో తప్పులేదన్నారు.. నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. టీటీడీ చైర్మన్ పదవిని బీజేపీ ఆశిస్తుందనేది బయట జరుగుతున్న ప్రచారమే, అందులో వాస్తవాలు లేవన్నారు.. ఏదైనా ఉంటే చర్చలు పూర్తవ్వగానే మీడియాకు చెబుతాం అన్నారు.
Read Also: Health tips : మీకు ఈ లక్షణాలుంటే షుగర్ వ్యాధి ఉన్నట్లే
ఇక, బీజేపీ ప్రపంచంలో బలమైన రాజకీయ పార్టీగా మారింది అన్నారు పురంధేశ్వరి.. అయితే, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లు ఎత్తి వేస్తారని, రాజ్యాంగాలు మార్చేస్తారని దుష్ప్రచారం చేశారని.. అందుకే 2024 ఎన్నికల్లో అనుకున్న దానికంటే ఓ పది సీట్లు తగ్గాయన్నారు.. కార్యకర్తల బలం కూడా రోజు రోజుకి పెరిగింది… 2014 లో 11 కోట్ల మంది సభ్యులు బీజేపీ పొందింది… 2019 లో 18 కోట్ల మంది సభ్యులుగా చేరారు.. ఏపీ లో 35 లక్షల మంది సభ్యత్వాలు పొందారని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో మళ్లీ సభ్యత్వాలు నమోదు చేస్తున్నాం.. సెప్టెంబర్ 2న 5 గంటలకు బీజేపీ తొలి సభ్యత్వాన్ని ప్రధాని మోడీ తీసుకుంటారు.. సభ్యత్వాలు పూర్తి అవగానే కార్యవర్గ అంశాలు పరిష్కరిస్తాం అన్నారు. ప్రజల వద్దకు బీజేపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!