Jogi Ramesh: సీబీఐ దర్యాప్తు కోరండి.. అప్పుడే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు..
- సిట్ను పక్కన పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐ దర్యాప్తు కోరాలి..
- అప్పుడే నకిలీ మద్యం కేసులో ఆయనకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: సిట్ను పక్కన పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐ దర్యాప్తు కోరాలి.. అప్పుడే నకిలీ మద్యం కేసులో ఆయనకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్.. నకిలీ మద్యం వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.. ఇది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.. కేసులో అసలు నిందితులను పట్టుకోవడం కోసం సిట్ వేశారని విమర్శించారు.. ఈ సిట్ చంద్రబాబు గుప్పిట్లో ఉండే సిట్ అని పేర్కొన్నారు.. చంద్రబాబు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అని.. సిట్ ను పక్కన పెట్టి చంద్రబాబు సీబీఐ దర్యాప్తు కోరాలి అని డిమాండ్ చేశారు జోగి రమేష్..
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్ధన్ రావు విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోన్న విషయం విదితమే… వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు అంగీకరించారు జనార్ధన్ రావు.. అయితే, టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని పేర్కొన్నాడు.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని.. టీడీపీ ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించడానికి మళ్లీ నువ్వు నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేష్ నాతో అన్నారు అని వెల్లడించారు.. పై వారి ఆదేశాలతోనే నాకు నమ్మకస్తుడు అయిన నీకు ఈ పని అప్పజెప్పుతున్నాను. నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేష్ నాతో అన్నారని.. ఇబ్రహీంపట్నంలో పెట్టాలి అనుకున్నా.. కానీ, జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాం అని వీడియోలో వెల్లడించారు.. సీఎం చంద్రబాబు.. టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు.. మన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం.. సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నారు.. ఇబ్రహీంపట్నం గోడౌన్ లో ముందు రోజే అన్ని తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ అన్నారు.. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు అని పేర్కొన్నాడు జనార్దన్ రావు.. అనుకున్నది అంతా జరిగింది.. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది.. అంతా బాగా జరిగింది నువ్వు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నారు.. అంతా నేను చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు.. నా తమ్ముడ్ని కూడా ఇందులో జోగి రమేష్ ఇరికించాడు.. అని సంచలన విషయాలు బయటపెట్టాడు జనార్ధన్ రావు..
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!