Vijayawada: దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి.. రేపటి నుంచే సంబరాలు..!
- దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి..
- ఈసారి 11 అవతారాలలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు..
- ఉత్సవాలకు ఈసారి మహిళా భక్తులు భారీగా వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది. ఇక, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీ శక్తి పథకంతో ఉచిత బస్సులు ఉండడంతో ఈసారి మహిళా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అలాగే, వీఐపీ, వీవీఐపీ భక్తులు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే రావాలి.. దసరాతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వీఐపీ భక్తుల తాకిడి అధికంగా ఉండే ఛాన్స్ ఉండడంతో ప్రతి ఒక్కరికి అధికారులు సూచనలు చేస్తున్నారు.
Read Also: Mohanlal : లాలెట్టా.. ఆ జానర్ లో సినిమాలు వద్దు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
అయితే, ఈ సారి తిధుల ప్రకారం 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం పది అవతారలలో దర్శనం ఇచ్చిన అమ్మ వారు ఈ సంవత్సరం 11వ ప్రత్యేక అవతారం కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.. ఈసారి సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామంటున్నారు. వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కేటాయిస్తామని అన్నారు. ఈ దసరా ఉత్సవాలకు రూ. 500 టికెట్స్ రద్దు చేయగా కేవలం రూ. 300, రూ. 100 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Read Also: BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!.. ఈయన ఎవరంటే?
ఇక, అమ్మ వారి భక్తులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ కూడా నిత్యం జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీలకు సాయంత్రం 4 గంటలకు దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. క్లూ లైన్ లో వాటర్ బాటిల్స్, బిస్కెట్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అలాగే, 5000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ నిర్వహించనున్నారు. ఇక, 500 సీసీ కెమెరాలు, 25 డ్రోన్స్ తో దసరా ఉత్సవాలను పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!