Vijayawada: దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి.. రేపటి నుంచే సంబరాలు..!
- దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి..
- ఈసారి 11 అవతారాలలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు..
- ఉత్సవాలకు ఈసారి మహిళా భక్తులు భారీగా వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది. ఇక, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీ శక్తి పథకంతో ఉచిత బస్సులు ఉండడంతో ఈసారి మహిళా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అలాగే, వీఐపీ, వీవీఐపీ భక్తులు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే రావాలి.. దసరాతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వీఐపీ భక్తుల తాకిడి అధికంగా ఉండే ఛాన్స్ ఉండడంతో ప్రతి ఒక్కరికి అధికారులు సూచనలు చేస్తున్నారు.
Read Also: Mohanlal : లాలెట్టా.. ఆ జానర్ లో సినిమాలు వద్దు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
అయితే, ఈ సారి తిధుల ప్రకారం 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం పది అవతారలలో దర్శనం ఇచ్చిన అమ్మ వారు ఈ సంవత్సరం 11వ ప్రత్యేక అవతారం కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.. ఈసారి సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామంటున్నారు. వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కేటాయిస్తామని అన్నారు. ఈ దసరా ఉత్సవాలకు రూ. 500 టికెట్స్ రద్దు చేయగా కేవలం రూ. 300, రూ. 100 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Read Also: BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!.. ఈయన ఎవరంటే?
ఇక, అమ్మ వారి భక్తులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ కూడా నిత్యం జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీలకు సాయంత్రం 4 గంటలకు దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. క్లూ లైన్ లో వాటర్ బాటిల్స్, బిస్కెట్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అలాగే, 5000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ నిర్వహించనున్నారు. ఇక, 500 సీసీ కెమెరాలు, 25 డ్రోన్స్ తో దసరా ఉత్సవాలను పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..