BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!.. ఈయన ఎవరంటే?
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- మిథున్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)కు ముందు ఖాళీగా ఉన్న బోర్డు పదవులకు అభ్యర్థులను ఖరారు చేయడానికి బీసీసీఐ అనుభవజ్ఞులైన నిర్వాహకులు, కీలక నిర్ణయాధికారులు శనివారం అనధికారిక సమావేశాన్ని నిర్వహించారు. వర్గాల సమాచారం ప్రకారం, పేర్లు పరిశీలించబడిన వారిని సమావేశానికి పిలిచారు. జమ్మూ క్రికెట్ అసోసియేషన్ నుండి వచ్చిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ కొత్త బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. భారతదేశం తరపున ఎప్పుడూ ఆడని మిథున్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
Also Read:Uttarpradesh: అసలు మీరు మనుషులేనా మీరు… పిన్నితో అక్రమ సంబంధం..
Also Read
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ బాడీ నామినీగా సెప్టెంబర్ 21న జరిగే తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశానికి మిథున్ మన్హాస్ హాజరవుతారు. భారత మాజీ స్పిన్నర్ రఘురామ్ భట్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, లెజెండరీ హర్భజన్ సింగ్ పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తారు. బిన్నీ పదవీకాలం గత నెలలో ముగిసిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసిన రాజీవ్ శుక్లా బిసిసిఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు. దేవజిత్ సైకియా బిసిసిఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు. ప్రబ్తేజ్ భాటియా జాయింట్ సెక్రటరీగా కొనసాగుతారు. భారత మాజీ స్పిన్నర్, కర్ణాటక క్రికెట్ చీఫ్ రఘురామ్ భట్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అరుణ్ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్గా కొనసాగనున్నారు.
Also Read:Ambati Rambabu : డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్ మీద తోసేస్తున్నారు
మిథున్ మన్హాస్ ఎవరు?
1979 అక్టోబర్ 12న జమ్మూ కాశ్మీర్లో జన్మించిన మిథున్ మన్హాస్ భారత దేశవాళీ క్రికెట్లో ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు. ఢిల్లీలో ప్రారంభమై జమ్మూ కాశ్మీర్లో ముగిసిన 18 సంవత్సరాల ఫస్ట్-క్లాస్ కెరీర్లో, అతను 157 మ్యాచ్లు ఆడి 46 కంటే తక్కువ సగటుతో 9,714 పరుగులు చేశాడు. 27 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు చేశాడు. 2007-08లో ఢిల్లీ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో మిథున్ సభ్యుడు. 2008- 2014 మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ డేర్డెవిల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. రిటైర్ అయిన తర్వాత, బ్యాటింగ్ కన్సల్టెంట్గా, IPL సపోర్ట్ స్టాఫ్గా (ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో) పనిచేశాడు. జమ్మూ & కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో కీ రోల్ పోషించాడు.
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!