BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!.. ఈయన ఎవరంటే?
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- మిథున్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)కు ముందు ఖాళీగా ఉన్న బోర్డు పదవులకు అభ్యర్థులను ఖరారు చేయడానికి బీసీసీఐ అనుభవజ్ఞులైన నిర్వాహకులు, కీలక నిర్ణయాధికారులు శనివారం అనధికారిక సమావేశాన్ని నిర్వహించారు. వర్గాల సమాచారం ప్రకారం, పేర్లు పరిశీలించబడిన వారిని సమావేశానికి పిలిచారు. జమ్మూ క్రికెట్ అసోసియేషన్ నుండి వచ్చిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ కొత్త బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. భారతదేశం తరపున ఎప్పుడూ ఆడని మిథున్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
Also Read:Uttarpradesh: అసలు మీరు మనుషులేనా మీరు… పిన్నితో అక్రమ సంబంధం..
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ బాడీ నామినీగా సెప్టెంబర్ 21న జరిగే తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశానికి మిథున్ మన్హాస్ హాజరవుతారు. భారత మాజీ స్పిన్నర్ రఘురామ్ భట్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, లెజెండరీ హర్భజన్ సింగ్ పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తారు. బిన్నీ పదవీకాలం గత నెలలో ముగిసిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసిన రాజీవ్ శుక్లా బిసిసిఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు. దేవజిత్ సైకియా బిసిసిఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు. ప్రబ్తేజ్ భాటియా జాయింట్ సెక్రటరీగా కొనసాగుతారు. భారత మాజీ స్పిన్నర్, కర్ణాటక క్రికెట్ చీఫ్ రఘురామ్ భట్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అరుణ్ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్గా కొనసాగనున్నారు.
Also Read:Ambati Rambabu : డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్ మీద తోసేస్తున్నారు
మిథున్ మన్హాస్ ఎవరు?
1979 అక్టోబర్ 12న జమ్మూ కాశ్మీర్లో జన్మించిన మిథున్ మన్హాస్ భారత దేశవాళీ క్రికెట్లో ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు. ఢిల్లీలో ప్రారంభమై జమ్మూ కాశ్మీర్లో ముగిసిన 18 సంవత్సరాల ఫస్ట్-క్లాస్ కెరీర్లో, అతను 157 మ్యాచ్లు ఆడి 46 కంటే తక్కువ సగటుతో 9,714 పరుగులు చేశాడు. 27 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు చేశాడు. 2007-08లో ఢిల్లీ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో మిథున్ సభ్యుడు. 2008- 2014 మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ డేర్డెవిల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. రిటైర్ అయిన తర్వాత, బ్యాటింగ్ కన్సల్టెంట్గా, IPL సపోర్ట్ స్టాఫ్గా (ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో) పనిచేశాడు. జమ్మూ & కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో కీ రోల్ పోషించాడు.
తాజావార్తలు
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!