AP Crime: డ్రగ్స్ కేసులో ఉన్నారని బెదిరింపులు.. మహిళా ఉద్యోగి నుంచి రూ.32 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరింపులు..
- మహిళా ఉద్యోగి నుంచి రూ. 32 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..
- సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కిన బ్యాంకు ఉద్యోగి..
- టెలిగ్రామ్ యాప్ లింక్ ద్వారా టాస్క్లు ఇచ్చి రూ.13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. బ్యాంకు వివరాలు, ఫోన్ నంబర్, పిన్ నంబర్లు రాబట్టి అందనికాడికి డబ్బులు దండుకోవడమే కాదు.. కొన్నిసార్లు మాయమాటలు, బెదిరింపులతో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు.. తాజాగా, విజయవాడ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరించి.. ఓ మహిళా ఉద్యోగి నుంచి రూ. 32 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.. బాధితురాలు విజయవాడ భవానీపురానికి చెందిన మహిళా ఉద్యోగి.. రెండు దఫాలుగా 32 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లో వేశారు బాధిత మహిళ.. మీ పేరుతో కొరియర్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు, పాస్ పోర్ట్, 35 వేలు నగదు ఉన్నాయని సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు.. ముంబై నుంచి సైబర్ సీఐ మాట్లాడుతున్నట్టు మహిళకు పదే పదే ఫోన్ చేయటంతో భయపడి ఆమె.. రూ.32 లక్షలు వారు చెప్పిన ఖాతాలో వేశారు.. ఆ తర్వాత ఇదంతా ఫేక్ అని గుర్తించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Read Also: Rambha: ఒకప్పుడు కుర్రాళ్ళ కలల హీరోయిన్ రంభ.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
మరోవైపు గుంటూరులో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు బ్యాంకు ఉద్యోగి హేమంత్ కుమార్.. టెలిగ్రామ్ యాప్ లింక్ ద్వారా టాస్క్లు ఇచ్చి.. రేటింగ్ పూర్తి చేస్తే డబ్బులు జమ చేస్తామంటూ వలవేశారు ఆన్లైన్ మోసగాళ్లు.. అది గ్రహించని సదరు బ్యాంకు ఉద్యోగి.. మోసగాళ్లు మాటలు నమ్మి రూ.13 లక్షల పోగొట్టుకున్నాడు.. ఆ తర్వాత.. మోసపోయానంటూ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఇలా పలు రకాలుగా మోసాలకు తెరలేపుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు. వారితో జాగ్రత్తగా ఉండాలని.. ఆన్లైన్లో ఎవరిని పడితే వారిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తు్న్నారు.
తాజావార్తలు
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..