AP Crime: డ్రగ్స్ కేసులో ఉన్నారని బెదిరింపులు.. మహిళా ఉద్యోగి నుంచి రూ.32 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరింపులు..
- మహిళా ఉద్యోగి నుంచి రూ. 32 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..
- సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కిన బ్యాంకు ఉద్యోగి..
- టెలిగ్రామ్ యాప్ లింక్ ద్వారా టాస్క్లు ఇచ్చి రూ.13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. బ్యాంకు వివరాలు, ఫోన్ నంబర్, పిన్ నంబర్లు రాబట్టి అందనికాడికి డబ్బులు దండుకోవడమే కాదు.. కొన్నిసార్లు మాయమాటలు, బెదిరింపులతో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు.. తాజాగా, విజయవాడ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరించి.. ఓ మహిళా ఉద్యోగి నుంచి రూ. 32 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.. బాధితురాలు విజయవాడ భవానీపురానికి చెందిన మహిళా ఉద్యోగి.. రెండు దఫాలుగా 32 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లో వేశారు బాధిత మహిళ.. మీ పేరుతో కొరియర్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు, పాస్ పోర్ట్, 35 వేలు నగదు ఉన్నాయని సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు.. ముంబై నుంచి సైబర్ సీఐ మాట్లాడుతున్నట్టు మహిళకు పదే పదే ఫోన్ చేయటంతో భయపడి ఆమె.. రూ.32 లక్షలు వారు చెప్పిన ఖాతాలో వేశారు.. ఆ తర్వాత ఇదంతా ఫేక్ అని గుర్తించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Read Also: Rambha: ఒకప్పుడు కుర్రాళ్ళ కలల హీరోయిన్ రంభ.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
Also Read
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
మరోవైపు గుంటూరులో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు బ్యాంకు ఉద్యోగి హేమంత్ కుమార్.. టెలిగ్రామ్ యాప్ లింక్ ద్వారా టాస్క్లు ఇచ్చి.. రేటింగ్ పూర్తి చేస్తే డబ్బులు జమ చేస్తామంటూ వలవేశారు ఆన్లైన్ మోసగాళ్లు.. అది గ్రహించని సదరు బ్యాంకు ఉద్యోగి.. మోసగాళ్లు మాటలు నమ్మి రూ.13 లక్షల పోగొట్టుకున్నాడు.. ఆ తర్వాత.. మోసపోయానంటూ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఇలా పలు రకాలుగా మోసాలకు తెరలేపుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు. వారితో జాగ్రత్తగా ఉండాలని.. ఆన్లైన్లో ఎవరిని పడితే వారిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తు్న్నారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..