Vijayawada Floods: బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన..
- బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన..
- రైవస్ కాలువ.. ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు మంపు ప్రాంతం పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవాడలో కొనసాగుతూనే ఉంది.. విజయవాడ నగరం వరదలతో అతలాకుతలం అయినప్పటి నుంచి.. సమీక్షలు.. సమావేశాలు.. ఫీల్డ్ విజిట్లు ఇలా విశ్రాంతి లేకుండా గడుపుతున్న ఆయన.. ఈ రోజు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు మంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు కాలువపై పంటుపై ప్రయాణించి అవతలి గట్టుకు చేరుకుని ముంపు ప్రభావంపై పరిశీలన జరిపారు.
Read Also: Himachal Pradesh: హిమాచల్ రాజకీయాల్లో ‘మసీదు’ వివాదం.. లవ్జీహాద్పై కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు..
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఇక, బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే పనులపై సమీక్ష చేశారు సీఎం చంద్రబాబు… అనంతరం కేసరపల్లి వంతెన వద్ద బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించారు. బుడమేరు డ్రైన్లో వరద ప్రవాహం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అక్కడి నుంచి మధురానగర్ వెళ్లిన ముఖ్యంమంత్రి ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరుకైన ప్రాంతంలోకి వెళ్లి మరీ అక్కడ పరిసరాలు పరిశీలించారు. అక్కడ నుంచి దేవినగర్, పుసుపుతోట, సింగ్ నగర్ గవర్నమెంట్ ప్రెస్ పరిధిలో పర్యటించారు. ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితి, భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై సిఎం సమీక్షించారు. దేవీనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జిపై పర్యటనలో ఉన్న సమయంలోనే ట్రైన్ వచ్చింది. దీంతో ఆ సమయంలో సిఎం పక్కన ఉన్న ర్యాంప్ పైకి వెళ్లారు. ట్రైన్ వెళ్లిన తరువాత అక్కడ నుంచి కదలిలారు. అనంతరం అక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!