Buddha Venkanna: జగన్పై బుద్దా వెంకన్న ఫైర్.. చంద్రబాబు తీరు దేశానికే ఆదర్శం..!
- వైఎస్ జగన్ పై బుద్దా వెంకన్న ఫైర్..
- వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం..
- వైసీపీ నేతలు భరించ లేక పోతున్నారు..
- వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి..
Buddha Venkanna: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం అన్నారు.. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారు.. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు భరించ లేక పోతున్నారు.. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి.. అబద్దాలు ప్రచారం చేసే అడ్రెస్ లేకుండా పోయారు.. మళ్లీ చేస్తే.. వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం అని జోస్యం చెప్పారు.. దమ్ముంటే వరదల్లో అవినితి జరిగిందని బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.. అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.
Read Also: Kamala Harris: అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే నేను రష్యా అధ్యక్షుడిని కలవను..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్ అని మండిపడ్డారు వెంకన్న.. ఏనాడైనా బురదలో అడుగు పెట్టి ప్రజలను కలిశావా? నువ్వా పేద ప్రజల కోసం మాట్లాడేది.. వరద ప్రజలకు నువ్వెంత సహాయం చేశావు..? కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఎవరికి ఖర్చు పెట్టారు..? సిగ్గు శరం లేకుండా అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తావా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విపత్తు ఎప్పుడు వచ్చినా నేనున్నా అని ప్రజలతో ఉండే సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు.. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ కూడా నీతులు వల్లిస్తున్నాడు.. అబద్దాలు చెప్పడానికి కూడా అర్ధం లేదా మీకు.. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే మీ కుట్ర లను తిప్పి కొడతాం అన్నారు.. 151 స్థానాల నుంచి 11స్థానాలకు ప్రజలు నిన్ను పరిమితం చేశారు.. ఇలాంటి కుట్రలు చేస్తే ఒక్క స్థానం కూడా ఉండదని జోస్యం చెప్పారు టీడీపీ నేత బుద్దా వెంకన్న..
తాజావార్తలు
-
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
-
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
-
Tamil Nadu: విజయ్తో టచ్లోకి అన్నాడీఎంకే..
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!