Purandeswari: చంద్రబాబు, అమిత్షా భేటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
- ఏపీ పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా..
- రేపు సీఎం చంద్రబాబుతో అమిత్ షా డిన్నర్ మీటింగ్..
- ఇద్దరి మధ్య ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి..
- రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది..
- ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్న పురంధేశ్వరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. ఈ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు.. డిన్నర్ మీటింగ్ లో సీఎం, కేంద్ర హోంమంత్రి.. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.. పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.. ఇక రేపు రాత్రికి విజయవాడ నోవాటెల్ లో అమిత్ షా బస చేసి.. ఎల్లుండి గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే NDRF 20వ వ్యవస్ధాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అయితే, అమిత్షా ఏపీ పర్యటన.. సీఎం చంద్రబాబుపై భేటీపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి..
Read Also: Jeevan Reddy: రైతు భరోసా ప్రభుత్వం ప్రకటించినా.. బీఆర్ఎస్ రైతు ధర్నా అంటూ డ్రామా చేస్తోంది!
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎంను కలవడం ఆనవాయితీగానే వస్తోందన్నారు పురంధేశ్వరి.. ఇద్దరి మధ్యా పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి.. రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది… రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చు.. అమిత్ షా, సీఎం కలయికలో వచ్చే అంశాలపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.. ఇక, వైజాగ్ స్టీల్ప్లాంట్ రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్.. వాజ్ పేయ్ కాలంలో స్టీల్ ప్లాంటుకు నిధులు విడుదల చేశాం.. ఇప్పుడూ విడుదల చేశామన్నారు.. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ మేం కేంద్రం నుంచి కావాలని అడిగినదే న్నారు.. కేప్టివ్ మైన్స్ అనే అంశం కచ్చితంగా నిర్ణయిస్తారని తెలిపారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం నిధులు ఇస్తోంది.. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల ఇదంతా సాధ్యం అవుతుందన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి..
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!