Jeevan Reddy: రైతు భరోసా ప్రభుత్వం ప్రకటించినా.. బీఆర్ఎస్ రైతు ధర్నా అంటూ డ్రామా చేస్తోంది!
- జనవరి 26 నుండి రైతు భరోసా అమలు
- బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తోంది
- షాబాద్లో బీఆర్ఎస్ రైతు ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. తాము దీక్ష చేస్తేనే.. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా మోసాలపై ‘రైతు ధర్నా’ పేరుతో బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్లో రైతు ధర్నా చేపట్టింది.
బీఆర్ఎస్ రైతు ధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ‘జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుంది. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుంది. మేము దీక్ష చేస్తేనే ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉంది. రైతులకు బోనస్ ఇచ్చింది మేము, మీరు కాదు. దేశంలో ఎక్కడా బోనస్ ఇవ్వట్లే. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారమూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ వడ్డీ మాత్రమే మాఫీ చేసింది. బీజేపీకి అసలు రుణాలు మాఫీ చేసే సంస్కృతి లేనే లేదు’ అని జీవన్ రెడ్డి విమర్శించారు.
Also Read
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
‘విచారణ కేటీఆర్ మీద కొనసాగుతుంది. విచారణ ఎదుర్కొంటూ.. జడ్జి దగ్గరకు నేను వస్తా, నువ్వు వస్తావా అని అంటున్నాడు. వక్రీకరించే పనిలో కేటీఆర్ ఉన్నాడు. విచారణ ఫార్ములా ఈ రేసుపై జరుగుతుంది. ప్రజల దృష్టి మరల్చడానికి కేటీఆర్ ఈ ఎత్తుగడ వేస్తున్నాడు’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యరు. రైతులు పండించే సన్నాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క