Jeevan Reddy: రైతు భరోసా ప్రభుత్వం ప్రకటించినా.. బీఆర్ఎస్ రైతు ధర్నా అంటూ డ్రామా చేస్తోంది!
- జనవరి 26 నుండి రైతు భరోసా అమలు
- బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తోంది
- షాబాద్లో బీఆర్ఎస్ రైతు ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. తాము దీక్ష చేస్తేనే.. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా మోసాలపై ‘రైతు ధర్నా’ పేరుతో బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్లో రైతు ధర్నా చేపట్టింది.
బీఆర్ఎస్ రైతు ధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ‘జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుంది. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుంది. మేము దీక్ష చేస్తేనే ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉంది. రైతులకు బోనస్ ఇచ్చింది మేము, మీరు కాదు. దేశంలో ఎక్కడా బోనస్ ఇవ్వట్లే. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారమూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ వడ్డీ మాత్రమే మాఫీ చేసింది. బీజేపీకి అసలు రుణాలు మాఫీ చేసే సంస్కృతి లేనే లేదు’ అని జీవన్ రెడ్డి విమర్శించారు.
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
‘విచారణ కేటీఆర్ మీద కొనసాగుతుంది. విచారణ ఎదుర్కొంటూ.. జడ్జి దగ్గరకు నేను వస్తా, నువ్వు వస్తావా అని అంటున్నాడు. వక్రీకరించే పనిలో కేటీఆర్ ఉన్నాడు. విచారణ ఫార్ములా ఈ రేసుపై జరుగుతుంది. ప్రజల దృష్టి మరల్చడానికి కేటీఆర్ ఈ ఎత్తుగడ వేస్తున్నాడు’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యరు. రైతులు పండించే సన్నాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!