Jeevan Reddy: రైతు భరోసా ప్రభుత్వం ప్రకటించినా.. బీఆర్ఎస్ రైతు ధర్నా అంటూ డ్రామా చేస్తోంది!
- జనవరి 26 నుండి రైతు భరోసా అమలు
- బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తోంది
- షాబాద్లో బీఆర్ఎస్ రైతు ధర్నా
జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. తాము దీక్ష చేస్తేనే.. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా మోసాలపై ‘రైతు ధర్నా’ పేరుతో బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్లో రైతు ధర్నా చేపట్టింది.
బీఆర్ఎస్ రైతు ధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ‘జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుంది. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుంది. మేము దీక్ష చేస్తేనే ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉంది. రైతులకు బోనస్ ఇచ్చింది మేము, మీరు కాదు. దేశంలో ఎక్కడా బోనస్ ఇవ్వట్లే. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారమూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ వడ్డీ మాత్రమే మాఫీ చేసింది. బీజేపీకి అసలు రుణాలు మాఫీ చేసే సంస్కృతి లేనే లేదు’ అని జీవన్ రెడ్డి విమర్శించారు.
Also Read
‘విచారణ కేటీఆర్ మీద కొనసాగుతుంది. విచారణ ఎదుర్కొంటూ.. జడ్జి దగ్గరకు నేను వస్తా, నువ్వు వస్తావా అని అంటున్నాడు. వక్రీకరించే పనిలో కేటీఆర్ ఉన్నాడు. విచారణ ఫార్ములా ఈ రేసుపై జరుగుతుంది. ప్రజల దృష్టి మరల్చడానికి కేటీఆర్ ఈ ఎత్తుగడ వేస్తున్నాడు’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యరు. రైతులు పండించే సన్నాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!