First Railway Bridge : 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత
- కృష్ణా నదిపై బ్రిటిష్ కాలం నాటి తొలి రైల్వే వంతెన
- స్టీల్ లేకుండా నిర్మించిన అద్భుత ఇంజనీరింగ్ కట్టడం
- కొత్త డబుల్ లైన్ బ్రిడ్జ్ కోసం పాత వంతెన తొలగింపు
- హెరిటేజ్గా కాపాడాలన్న స్థానికుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ నగర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. బ్రిటిష్ పాలనలో కృష్ణా నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే వంతెన ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోనుంది. 130 ఏళ్ల క్రితం బెజవాడను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించిన ఈ చారిత్రక కట్టడం, జ్ఞాపకాలకే పరిమితం కాబోతోంది.
IPL 2026: దుమ్మురేపే స్ట్రైక్ రేట్లు.. ఐపీఎల్లో ‘ధురంధర్’లు వీరే!
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
1893 మార్చి 17న బ్రిటిష్ ఇంజనీర్లు ఈ వంతెనను తొలి మీటర్ గేజ్ బ్రిడ్జ్గా నిర్మించారు. ఆ రోజుల్లో దీనిని ‘కృష్ణా ప్యాలెస్’ అని పిలిచేవారు. ఈ వంతెన నిర్మాణంలో ఎటువంటి స్టీల్ ఉపయోగించకపోవడం విశేషం. కేవలం రాతి బండలు, గానుగ సున్నంతో మాత్రమే నిర్మించిన ఈ కట్టడం, నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. దాదాపు ఒక శతాబ్ద కాలం పాటు, అంటే 1989 వరకు లక్షలాది రైళ్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఈ వంతెన, 1993లో అధికారికంగా సేవలను నిలిపివేసింది.
విజయవాడ-గూడూరు మార్గంలో రైళ్ల రద్దీ విపరీతంగా పెరగడంతో, రైల్వే శాఖ ఇక్కడ అత్యాధునిక డబుల్ లైన్ వంతెనను నిర్మించాలని నిర్ణయించింది. ఈ కొత్త వంతెన నిర్మాణానికి పాత పిల్లర్లు అడ్డుగా ఉండటం, అలాగే వరదల సమయంలో కాలం తీరిన ఈ పిల్లర్లు ప్రమాదకరంగా మారి పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జిలపై పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే బోర్డు పాత వంతెన ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.
ఈ వంతెన పిల్లర్లు నేటికీ ఎంత దృఢంగా ఉన్నాయంటే, వాటిని కూల్చడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. హైడ్రాలిక్ క్రేన్లతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ప్రస్తుతం ‘లిమిటెడ్ బ్లాస్టింగ్’ పద్ధతిని పరిశీలిస్తున్నారు. ఒక్కో పిల్లర్ను తొలగించేందుకు సుమారు 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ చారిత్రక నిర్మాణాన్ని ఒక పర్యాటక కేంద్రంగా లేదా హెరిటేజ్ సంపదగా కాపాడాలని విజయవాడ వాసులు దశాబ్ద కాలంగా కోరుతున్నారు. అభివృద్ధి వేగం ముందు ఈ అద్భుత కట్టడం కనుమరుగవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో కొద్ది రోజుల్లో కృష్ణమ్మ ఒడిలో నిలిచిన ఈ చారిత్రక చిహ్నం పూర్తిగా చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోనుంది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!