First Railway Bridge : 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత
- కృష్ణా నదిపై బ్రిటిష్ కాలం నాటి తొలి రైల్వే వంతెన
- స్టీల్ లేకుండా నిర్మించిన అద్భుత ఇంజనీరింగ్ కట్టడం
- కొత్త డబుల్ లైన్ బ్రిడ్జ్ కోసం పాత వంతెన తొలగింపు
- హెరిటేజ్గా కాపాడాలన్న స్థానికుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ నగర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. బ్రిటిష్ పాలనలో కృష్ణా నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే వంతెన ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోనుంది. 130 ఏళ్ల క్రితం బెజవాడను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించిన ఈ చారిత్రక కట్టడం, జ్ఞాపకాలకే పరిమితం కాబోతోంది.
IPL 2026: దుమ్మురేపే స్ట్రైక్ రేట్లు.. ఐపీఎల్లో ‘ధురంధర్’లు వీరే!
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
1893 మార్చి 17న బ్రిటిష్ ఇంజనీర్లు ఈ వంతెనను తొలి మీటర్ గేజ్ బ్రిడ్జ్గా నిర్మించారు. ఆ రోజుల్లో దీనిని ‘కృష్ణా ప్యాలెస్’ అని పిలిచేవారు. ఈ వంతెన నిర్మాణంలో ఎటువంటి స్టీల్ ఉపయోగించకపోవడం విశేషం. కేవలం రాతి బండలు, గానుగ సున్నంతో మాత్రమే నిర్మించిన ఈ కట్టడం, నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. దాదాపు ఒక శతాబ్ద కాలం పాటు, అంటే 1989 వరకు లక్షలాది రైళ్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఈ వంతెన, 1993లో అధికారికంగా సేవలను నిలిపివేసింది.
విజయవాడ-గూడూరు మార్గంలో రైళ్ల రద్దీ విపరీతంగా పెరగడంతో, రైల్వే శాఖ ఇక్కడ అత్యాధునిక డబుల్ లైన్ వంతెనను నిర్మించాలని నిర్ణయించింది. ఈ కొత్త వంతెన నిర్మాణానికి పాత పిల్లర్లు అడ్డుగా ఉండటం, అలాగే వరదల సమయంలో కాలం తీరిన ఈ పిల్లర్లు ప్రమాదకరంగా మారి పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జిలపై పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే బోర్డు పాత వంతెన ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.
ఈ వంతెన పిల్లర్లు నేటికీ ఎంత దృఢంగా ఉన్నాయంటే, వాటిని కూల్చడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. హైడ్రాలిక్ క్రేన్లతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ప్రస్తుతం ‘లిమిటెడ్ బ్లాస్టింగ్’ పద్ధతిని పరిశీలిస్తున్నారు. ఒక్కో పిల్లర్ను తొలగించేందుకు సుమారు 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ చారిత్రక నిర్మాణాన్ని ఒక పర్యాటక కేంద్రంగా లేదా హెరిటేజ్ సంపదగా కాపాడాలని విజయవాడ వాసులు దశాబ్ద కాలంగా కోరుతున్నారు. అభివృద్ధి వేగం ముందు ఈ అద్భుత కట్టడం కనుమరుగవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో కొద్ది రోజుల్లో కృష్ణమ్మ ఒడిలో నిలిచిన ఈ చారిత్రక చిహ్నం పూర్తిగా చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!