Payyavula Keshav: రెండురోజుల్లో సంచలనాలు బయటపెడతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎప్పుడూ వార్తల్లో వుంటారు. తాజాగా ఆయన భద్రతకు సంబంధించి ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. పయ్యావుల కేశవ్ కు భద్రత పై సందిగ్ధత కొనసాగుతోంది. చంద్రబాబు నివాసంలో సమావేశానికి గన్ మెన్ లేకుండానే వచ్చారు పయ్యావుల కేశవ్. గన్ మెన్ అంటూ నిన్న నా వద్దకు వచ్చిన వ్యక్తి ఎటు వెళ్ళాడో తెలీదు. గన్ మెన్ లేకుండానే తిరుగుతున్నా.. ఏం జరుగుతుందో చూద్దాం. రెండు రోజుల్లో సంచలనాలు బయటపెడతానన్నారు కేశవ్.
పయ్యావుల కేశవ్ విషయంలో ప్రభుత్వం తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పయ్యావుల సెక్యూర్టీ ఎపిసోడులో ట్విస్టులు బయటపడుతున్నాయి. సోమవారం పయ్యావుల వద్దకు వచ్చిన కొత్త గన్ మెన్ ఆయనతో కాసేపు మాట్లాడిన సంగతి తెలిసిందే. తనను వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించారని పయ్యావులకు పరిచయం చేసుకున్నారు కొత్త గన్ మెన్. అయితే, సంప్రదాయం ప్రకారం యూనిఫాంలో ఉన్న ఆర్ఐ వచ్చి పీఎస్ఓను మారుస్తున్నామన్న విషయాన్ని వెల్లడించాలన్నారు పయ్యావుల. వచ్చిన వ్యక్తి గన్ మెన్ అవునో.. కాదో తనకు తెలియదన్నారు కేశవ్. ఆర్ఐ వచ్చి గన్ మెన్లను మార్చిన విషయాన్ని తెలిపి.. కొత్త పీఎస్వోను పరిచయం చేసిన వెంటనే విధుల్లో చేరమని గన్ మెన్ కు సూచించారు పయ్యావుల. అయితే ఇవాళ ఆ గన్ మెన్ గానీ, ఆర్ ఐ గానీ తన వద్దకు రాలేదని తెలిపారు పయ్యావుల కేశవ్.
Also Read
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
అంతకుముందు పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినట్టుగా వార్తలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ విషయమై ప్రభుత్వానికి పయ్యావుల కౌంటర్ ఇచ్చాకే సెక్యూర్టీని విత్ డ్రా చేసిందంటోంది టీడీపీ. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారు. పయ్యావులకు సెక్యూర్టీ విత్ డ్రా చేసుకోవడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగిందంటోంది టీడీపీ.మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ డీజీకి గతంలోనే పయ్యావుల లేఖ రాశారు. తనకు 1+1 స్థానంలో 2+2 భద్రత కల్పించాలని లేఖలో కోరారు కేశవ్. లేఖ రాసిన తర్వాత పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఉప సంహరించడంపై పయ్యావుల అనుచరుల్లో ఆందోళన వ్యక్తం అయింది. అయితే, జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనంతరం కొత్తగా పయ్యావులకు కేటాయించిన గన్ మెన్ల గురించిన సమాచారం తెలియచేశారు. ఇదిలా ఉంటే సంచలనాలు బయట పెడతానన్న పయ్యావుల కేశవ్ ఏంచేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!