Viral News: బెడిసికొట్టిన ప్లాన్.. ఒంటరి మహిళ ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్ళు ముగ్గురున్నారు.. దొంగతనం చేసేందుకు కొన్ని రోజులపాటు ఓ అపార్ట్మెంట్లో రెక్కీ నిర్వహించారు.. ఎట్టకేలకు ఓ ఇంటికి ఎంపిక చేసుకున్నారు.. ఆ ఇంట్లో ఒక్కతే మహిళ ఉంటుందని గమనించి పక్కా ప్లాన్ వేసుకున్నారు.. దాదాపు ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అనుకున్నారు.. ఇంట్లోకి వెళ్లి సామాన్లు దొంగలించడం ప్రారంభించారు.. చివర్లో ఆ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. దీంతో ఆ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే…
గుజరాత్ రాష్ట్రం అదాజన్లోని సీకే విల్లా సొసైటీలో జిగ్యాసా తేజస్ అనే మహిళ ఒంటరిగా నివాసముంటోంది. ఈమె సింగిల్గా ఉంటుందన్న విషయం తెలుసుకున్న ముగ్గురు దొంగలు.. ఆమె ఇంట్లో దొంగతనం చేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. కార్పొరేషన్ ఉద్యోగులుగా మారువేషం వేసుకొని, ఆమె ఇంటికి వెళ్లారు. వాటర్ ట్యాంక్ తనిఖీ కోసం వచ్చామని చెప్పారు. వాళ్ల వేషధారణ ప్రభుత్వ అధికారుల లాగే ఉండటంతో.. వారిని నమ్మి లోపలికి ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ ముగ్గురు దొంగలు మొదట్లో కాస్త బిల్డప్ ఇచ్చారు. వాటర్ ట్యాంక్ చుట్టూ పరిసరాలు గమనిస్తున్నట్టుగా నటించారు. ఈ క్రమంలోనే ఆమెకు క్లోరోఫామ్ ఇచ్చారు.
Also Read
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
- Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
అయితే.. జిగ్యాసా కంగారు పడలేదు. వాళ్ల ప్రవర్తనతోనే దొంగలు అని పసిగట్టిన ఆమె.. క్లోరోఫామ్ ఇచ్చినప్పుడు కంగారుపడకుండా, తెలివిగా మూర్చపోయినట్టు డ్రామా ఆడింది. దాంతో ఆమె మత్తులోకి జారుకుందని భావించి.. హాల్లోనే ఆ మహిళను పడేసి, లోనికెళ్లి సామాన్లు దోచుకోవడం మొదలుపెట్టారు. అదును చూసుకున్న జిగ్యాసా.. వెంటనే బయటకు పరుగులు తీసి, ‘ఇంట్లో దొంగలు పడ్డారు’ అంటూ కేకలు వేసింది. ఈ దెబ్బతో ఖంగుతిన్న ఆ ముగ్గురు దొంగలు.. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..