Viral News: బెడిసికొట్టిన ప్లాన్.. ఒంటరి మహిళ ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్ళు ముగ్గురున్నారు.. దొంగతనం చేసేందుకు కొన్ని రోజులపాటు ఓ అపార్ట్మెంట్లో రెక్కీ నిర్వహించారు.. ఎట్టకేలకు ఓ ఇంటికి ఎంపిక చేసుకున్నారు.. ఆ ఇంట్లో ఒక్కతే మహిళ ఉంటుందని గమనించి పక్కా ప్లాన్ వేసుకున్నారు.. దాదాపు ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అనుకున్నారు.. ఇంట్లోకి వెళ్లి సామాన్లు దొంగలించడం ప్రారంభించారు.. చివర్లో ఆ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. దీంతో ఆ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే…
గుజరాత్ రాష్ట్రం అదాజన్లోని సీకే విల్లా సొసైటీలో జిగ్యాసా తేజస్ అనే మహిళ ఒంటరిగా నివాసముంటోంది. ఈమె సింగిల్గా ఉంటుందన్న విషయం తెలుసుకున్న ముగ్గురు దొంగలు.. ఆమె ఇంట్లో దొంగతనం చేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. కార్పొరేషన్ ఉద్యోగులుగా మారువేషం వేసుకొని, ఆమె ఇంటికి వెళ్లారు. వాటర్ ట్యాంక్ తనిఖీ కోసం వచ్చామని చెప్పారు. వాళ్ల వేషధారణ ప్రభుత్వ అధికారుల లాగే ఉండటంతో.. వారిని నమ్మి లోపలికి ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ ముగ్గురు దొంగలు మొదట్లో కాస్త బిల్డప్ ఇచ్చారు. వాటర్ ట్యాంక్ చుట్టూ పరిసరాలు గమనిస్తున్నట్టుగా నటించారు. ఈ క్రమంలోనే ఆమెకు క్లోరోఫామ్ ఇచ్చారు.
Also Read
- Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
అయితే.. జిగ్యాసా కంగారు పడలేదు. వాళ్ల ప్రవర్తనతోనే దొంగలు అని పసిగట్టిన ఆమె.. క్లోరోఫామ్ ఇచ్చినప్పుడు కంగారుపడకుండా, తెలివిగా మూర్చపోయినట్టు డ్రామా ఆడింది. దాంతో ఆమె మత్తులోకి జారుకుందని భావించి.. హాల్లోనే ఆ మహిళను పడేసి, లోనికెళ్లి సామాన్లు దోచుకోవడం మొదలుపెట్టారు. అదును చూసుకున్న జిగ్యాసా.. వెంటనే బయటకు పరుగులు తీసి, ‘ఇంట్లో దొంగలు పడ్డారు’ అంటూ కేకలు వేసింది. ఈ దెబ్బతో ఖంగుతిన్న ఆ ముగ్గురు దొంగలు.. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!