LPG Supply: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే జరగాలని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం లేదని, అలాంటి చర్యలకు పాల్పడితే కంపెనీలు మరియు ప్రభుత్వం కలిసి కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. భారతదేశంలోని రిఫైనరీలకు గ్యాస్ ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న గ్యాస్లో సుమారు 10 నుంచి 20 శాతం వరకు భారత…
AP Budget 2026 Live Updates: ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బడ్జెట్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎన్టీవీని చూస్తూ ఉండండి..
AP Budget: ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 2026- 27 ఆర్థిక బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. సుమారు 3.48 లక్షల కోట్ల రూపాయలు మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఇక, ఉదయం 11.15 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు.
Andhra Pradesh Budget: 2026-27 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ను రేపు ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్ఱభుత్వం… రాష్ట్ర అసెంబ్లీలో ఉదయం 11:15కి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మొత్తం దాదాపు రూ.3.45–3.50 లక్షల కోట్లు ఉండే అవకాశముందని అంచనాలున్నాయి.. అయితే, బడ్జెట్కు ముందే.. అంటే రేపు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షనత ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోదముద్ర వేయనుంది మంత్రివర్గం..…
ఏవీ…. నాటి మాటల తూటాలు? ఏమైపోయింది ఆనాటి వాయిస్ బేస్? పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్…. విడమర్చి చెప్పి విడదీసి ప్రశ్నించి ప్రశ్నించే ఆ స్వరం ఇప్పుడు తొట్రు పడుతోందా? టీడీపీ నాయకుల్లో చాలామంది మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. మాట్లాడండి మంత్రిగారూ…. అంటూ పార్టీ నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఆ లీడర్ నోరు తెరవడం లేదా? ఆ స్పందనలు కూడా మునుపటిలా కాకుండా… తూతూ మంత్రంగా ఉంటున్నాయా? ఎవరా నేత? ఎందుకలా…
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం బాధాకరం అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారన్నారు. బస్సు ప్రమాదంపై కూడా కొన్ని చానళ్లు శవరాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. పింక్ డైమండ్, నారా రక్త చరిత్ర, మామిడి కాయల స్టోరీ.. ఇలా ఫేక్ రాజకీయాలు చేయడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దిట్ట…
Amaravati: అసెంబ్లీ ఆవరణలోని నూతన భవనాన్ని ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.. ఈ సందర్భంగా నూతన అసెంబ్లీ భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.. అసెంబ్లీ ఆవరణలో రూ.3.55 కోట్లతో ఈ భవనం నిర్మాణం చేశాం. మొదటి ఫ్లోర్ లో విప్ లకు కేటాయించాం.. మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ భవనాన్ని ప్రారంభించడం మా అందరికీ…
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మేలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలును ప్రజలకి వివరించాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ టూర్లపై కేబినెట్ భేటీలో చర్చించారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. ఏపీ…
వైసీపీ నేతలు లిక్కర్ పాలసీ అక్రమం అంటున్నారు, ఇవాళ ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో ఉన్న మద్యం పాలసీనే అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుక తోలుకోమని చెప్పింది తన ప్రభుత్వమే అని, వైసీపీ పాలనలో గ్రామ స్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారని ఎద్దేవా చేశారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్.. ఇలా అన్ని స్కాములు జరిగింది మీ హయాంలోనే అని మాజీ సీఎం వైఎస్…