ముగిసిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం ముగిసింది. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు 35 ఎలక్ట్రికల్ వాహనాలను డ్రైలీజ్ కు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిపాదనలకు సంబంధించి 10 ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు నుండి రూ.9 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.150 కోట్లు విరాళంగా అందింది. శ్రీవాణి ట్రస్టు దర్శనాలకు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో ప్రియారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.
అలాగే బర్డ్ ఆసుపత్రి పాత భవనంలో చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించి రూ.6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయలని పేర్కొనగా… టీటీడీలో భద్రత మరింత పటిష్టం చేసేందుకు రూ.2 కోట్లతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రూ.4.27 కోట్లతో 22 స్కానర్లు ఏర్పాటు చేయాలని… శ్రీవారి నైవేధ్యానికి స్వచ్ఛమైన ప్రకృతాసిద్ధమైన నెయ్యిని వినియోగించాలని నిర్ణయించాం అన్నారు. దీనికి సంబంధించి 25 గిర్ గోవులను విరాళంగా అందించారు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అలాగే స్వామివారి నైవేద్యానికి కావాల్సిన నెయ్యి తయారు చేయడానికి 1200 లీటర్ల పాలు అవసరమవుతాయి. స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి తయారీలో భక్తులను భాగస్వామ్యం చేసేందుకు నవనీత సేవ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛమైన నెయ్యి విరాళమివ్వాలనే భక్తుల కోసం నెయ్యిదానం కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాం. గోసంరక్షణపై చిత్తశుద్ధితో పని చేసే కుటుంబాలను తీసుకొచ్చి టీటీడీలో గోసంరక్షణలో భాగస్వామ్యం చేస్తాం. టీటీడీ అవసరాలకు తగిన విధంగా గోఆధారిత వ్యవసాయం ప్రొత్సాహించేందుకు కడప, కర్నూలు రైతులతో సమావేశమవుతాం ఇక ఇప్పట్లో శ్రీవారి దర్శనాల సంఖ్యను పెంచం అని స్పష్టం చేసారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!