Lashkar-e-Taiba: పాకిస్థాన్లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar-e-Taiba: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లలో (2020 నుంచి) పాకిస్థాన్లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు. పాకిస్థాన్లో జరిగిన ఓ సభలో అతడు మాట్లాడుతూ.. ఈ వరుస హత్యలకు భారత గూఢచార సంస్థలే కారణమని ఆరోపించాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలాకోట్ వంటి వివిధ ప్రాంతాలలో తమ క్యాడర్ను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలు జరిగాయని పేర్కొన్నాడు.
మతవిద్వేష పూరిత ప్రసంగం
తన ప్రసంగంలో ఈ నష్టాన్ని అంగీకరించడమే కాకుండా, ఇతర మతాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రిజ్వాన్ హనీఫ్, తమ సిద్ధాంతాలను సమర్థించుకుంటూ ఇతర విశ్వాసాలను తీవ్రంగా అపహాస్యం చేశాడు. ఉగ్రవాద సంస్థలు ప్రజలను రాడికలైజ్ చేయడానికి, తమ పప్పులు ఉడకబెట్టుకోవడానికి మతాన్ని ఎలా ఆయుధంగా వాడుకుంటాయనే దానికి ఈ ఘటన మరొక నిదర్శనంగా నిలిచింది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు అజ్ఞాత వ్యక్తుల చేతిలో వరసగా హతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా లష్కరే తొయిబా ఉన్నత స్థాయి నాయకుడే తమ ముఠాకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అంగీకరించడం గమనార్హం.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
తాజావార్తలు
-
Tabu AI Deepfake: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!