Lashkar-e-Taiba: పాకిస్థాన్లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar-e-Taiba: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లలో (2020 నుంచి) పాకిస్థాన్లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు. పాకిస్థాన్లో జరిగిన ఓ సభలో అతడు మాట్లాడుతూ.. ఈ వరుస హత్యలకు భారత గూఢచార సంస్థలే కారణమని ఆరోపించాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలాకోట్ వంటి వివిధ ప్రాంతాలలో తమ క్యాడర్ను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలు జరిగాయని పేర్కొన్నాడు.
మతవిద్వేష పూరిత ప్రసంగం
తన ప్రసంగంలో ఈ నష్టాన్ని అంగీకరించడమే కాకుండా, ఇతర మతాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రిజ్వాన్ హనీఫ్, తమ సిద్ధాంతాలను సమర్థించుకుంటూ ఇతర విశ్వాసాలను తీవ్రంగా అపహాస్యం చేశాడు. ఉగ్రవాద సంస్థలు ప్రజలను రాడికలైజ్ చేయడానికి, తమ పప్పులు ఉడకబెట్టుకోవడానికి మతాన్ని ఎలా ఆయుధంగా వాడుకుంటాయనే దానికి ఈ ఘటన మరొక నిదర్శనంగా నిలిచింది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు అజ్ఞాత వ్యక్తుల చేతిలో వరసగా హతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా లష్కరే తొయిబా ఉన్నత స్థాయి నాయకుడే తమ ముఠాకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అంగీకరించడం గమనార్హం.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
తాజావార్తలు
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?