జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకంలో భాగంగా మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలో స్థలాలను అందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి, నవులూరు పరిధిలో అమరావతి టౌన్షిప్లోని 331 స్థలాలను విక్రయించాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఆయా స్థలాలను ఈ-వేలంలో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ స్థలాలను సీఆర్డీఏ అధికారులు 12 లాట్లుగా విభజించారు. వీటిలో 200 చదరపు గజాల నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలాలు ఉన్నాయి.
Andhra Pradesh: ఏపీలో తగ్గిపోయిన సంతానోత్పత్తి.. కారణం ఏంటి?
తొలి లాట్గా 29 స్థలాలను ఆన్లైన్లో విక్రయిస్తామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. అమరావతి టౌన్షిప్లో స్థలాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు శుక్రవారం (మే 13న) ఉదయం 11 గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. పేర్లు నమోదు చేసుకున్నవారికి ఈ నెల 31న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో వేలం నిర్వహిస్తామని తెలిపారు.