Tomatos Theft: టమోటా దొంగలు.. పరేషాన్లో రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో దొంగలు పడడం మామూలే కానీ. ఏపీలో దొంగలు పడ్డారు. ఆ దొంగలకు బంగారం, డబ్బు అవసరం లేదు. వారికేం కావాలో తెలిస్తే మీరే షాకవుతారు. పొలంలో పండిన టమోటా బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. టమోటా ధరలు ఆకాశాన్నంటిన వేళ దొంగల కళ్ళు టమోటాలపై పడ్డాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టమోటాల కోసం దొంగలు పడ్డరు.
రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో చిత్తూరు జిల్లా సోమలలో దొంగల బెడద ఎక్కువైందని రైతులు వాపోతున్నారు.ఇన్నిరోజులు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఇప్పుడు దొంగల భయం పట్టుకుంది. టమోటా రేట్లు పెరగడంతో ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారని రైతులు చెబుతున్నారు.చిన్న సోమల మార్గంలో రోడ్డు పక్కన ఉన్న తోటలో సుమారు ఐదు బాక్సుల మేర టమోటాలను దుండగులు కోసుకెళ్లినట్టు బాధిత రైతు జగన్మోహన్ తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తే దొంగతనాలకు చెక్ పెట్టొచ్చని రైతులు అంటున్నారు. శాంతి భద్రతలకు సమయం సరిపోవడం లేదంటే.. టమోటా తోటలకు మేం ఎక్కడ కాపలా కాస్తామని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఉల్లిపాయలు రేట్లు వంద రూపాయలకు చేరినప్పుడు కూడా ఉల్లి దొంగలు రంగ ప్రవేశం చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో టమోటాలు భారీ ధర పలుకుతున్నాయి. నిన్న మొన్నటివరకూ 50 నుంచి 75 రూపాయలు పలికిన ధరలు ఇప్పుడు వంద దాటేశాయి. మరికొద్ది రోజుల ఈ ధరల మంట తప్పదంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. టమోటాల దొంగతనం గురించి తెలుసుకుని జనం నవ్వుకుంటున్నారు.
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
ఇదిలా వుంటే టమోటాలు కొనలేక సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వంటింట్లో టమోటా వాడకాన్ని తాత్కాలికంగా ఆపేశారు. విశాఖలో టమోటాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో సబ్సిడీపై టమోటాల అమ్మకాలు చేపట్టారు. కేజీ 60కి చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మదనపల్లె నుంచి తెప్పించి ప్రతీ రైతు బజారుకు రెండు టన్నులు పంపిణీ చేయనున్నారు. ప్రతి వినియోగదారుడికి ఒక కిలో మాత్రం ఇవ్వనున్నారు.
Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్.. పెరుగనున్న రీఛార్జ్ ధరలు..
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!