Bhumana Karunakar Reddy: టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు..
- టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి- భూమన
- ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది- భూమన కరుణాకర్ రెడ్డి
- చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయ- భూమన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కేంద్ర హోం శాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే, మీరు రద్దు చేయించారని తెలిపారు. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది.. విజయవాడకు అమిత్ షా వచ్చిన సందర్భంగా హడావిడిగా కేంద్రం బృందం పర్యటన రద్దు చేయించారు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యటన రద్దు చేస్తూ ప్రకటన చేశారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయంకు పంపిన ఘనత తమదని అన్నారు. మీ పాలనలో టీటీడీ పరువు తీశారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.
Read Also: Amit Shah: అమిత్ షాను చూస్తే అసూయ కలుగుతుంది: సీఎం చంద్రబాబు
Also Read
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు.. తిరుమలలో బాలుడు మృతి చెందాడు, బిర్యానీ పొట్లాలు కొండపైకి వెళ్ళాయి, మద్యం కూడా కొండపై దొరికాయి.. సర్వ సాక్షి శ్రీ వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు పాపాల పుట్ట కొండగా మారిందని మండిపడ్డారు. పశువుల దొడ్డిలో తోచినట్లు క్యూలైన్లో తోచి పెట్టారు.. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్ పై చర్యలు తీసుకోకుండా జిల్లా ఎస్పీని బదిలీ చేశారని అన్నారు. టీటీడీ చైర్మన్కు టీడీపీ నాయకులు సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశికి సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు.. రూ.70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారని అన్నారు. తిరుమలలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ 4 సార్లు దొరికింది.. సనాతన ధర్మం కాపాడతా అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించిన అటవీ శాఖలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Read Also: Bollywood : 25 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న హిట్ పెయిర్
లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బురద చల్లాలని చూశారు.. న్యాయ విచారణకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు టికెట్ల అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారని అన్నారు. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకోక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది.. ఈ అపరాధాలకు శిక్ష తప్పదని భూమన ఆరోపించారు. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.. అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోందని దుయ్యబట్టారు. భయం, భక్తి లేకుండా పోయింది.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తొక్కిసలాటలో మృతి చెందిన 6 కుటుంబాలకు రూ.25 లక్షలు చంద్రబాబు ప్రకటన చేస్తే, టీటీడీ నుంచి నగదు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!