Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bhumana Karunakar Reddy Severely Criticized Cm Chandrababu

Bhumana Karunakar Reddy: టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు..

Published Date :January 19, 2025 , 3:15 pm
By Rajesh Veeramalla
  • టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి- భూమన
  • ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది- భూమన కరుణాకర్ రెడ్డి
  • చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయ- భూమన.
Bhumana Karunakar Reddy: టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కేంద్ర హోం శాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే, మీరు రద్దు చేయించారని తెలిపారు. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది.. విజయవాడకు అమిత్ షా వచ్చిన సందర్భంగా హడావిడిగా కేంద్రం బృందం పర్యటన రద్దు చేయించారు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యటన రద్దు చేస్తూ ప్రకటన చేశారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. క్రౌడ్ మేనేజ్మెంట్‌కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయంకు పంపిన ఘనత తమదని అన్నారు. మీ పాలనలో టీటీడీ పరువు తీశారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.

Read Also: Amit Shah: అమిత్‌ షాను చూస్తే అసూయ కలుగుతుంది: సీఎం చంద్రబాబు

దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు.. తిరుమలలో బాలుడు మృతి చెందాడు, బిర్యానీ పొట్లాలు కొండపైకి వెళ్ళాయి, మద్యం కూడా కొండపై దొరికాయి.. సర్వ సాక్షి శ్రీ వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు పాపాల పుట్ట కొండగా మారిందని మండిపడ్డారు. పశువుల దొడ్డిలో తోచినట్లు క్యూలైన్‌లో తోచి పెట్టారు.. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్‌ పై చర్యలు తీసుకోకుండా జిల్లా ఎస్పీని బదిలీ చేశారని అన్నారు. టీటీడీ చైర్మన్‌కు టీడీపీ నాయకులు సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశికి సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు.. రూ.70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారని అన్నారు. తిరుమలలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ 4 సార్లు దొరికింది.. సనాతన ధర్మం కాపాడతా అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించిన అటవీ శాఖలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Read Also: Bollywood : 25 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న హిట్ పెయిర్

లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బురద చల్లాలని చూశారు.. న్యాయ విచారణకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు టికెట్ల అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారని అన్నారు. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకోక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది.. ఈ అపరాధాలకు శిక్ష తప్పదని భూమన ఆరోపించారు. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.. అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోందని దుయ్యబట్టారు. భయం, భక్తి లేకుండా పోయింది.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తొక్కిసలాటలో మృతి చెందిన 6 కుటుంబాలకు రూ.25 లక్షలు చంద్రబాబు ప్రకటన చేస్తే, టీటీడీ నుంచి నగదు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Bhumana Karunakar Reddy
  • cm chandrababu
  • ttd

తాజావార్తలు

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • Divyang Shakti Scheme: నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం!

  • Suryakumar Yadav: “గంభీర్ కాదు.. నన్ను కెప్టెన్ చేసింది ఈ నలుగురే”.. కెప్టెన్సీ వెనుక అసలు కథ చెప్పిన సూర్య

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • US-Iran War: హార్ముజ్ వద్ద అమెరికా బిగ్ ఆపరేషన్.. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్

ట్రెండింగ్‌

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions