RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RAW NTR Founder Sai Roop: తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ తమ సంస్థ చేపట్టనున్న ‘ఊరు–వాడ’ సేవా కార్యక్రమంపై వివరణ ఇచ్చారు. గత వారం రోజులుగా తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు, ప్రచారాల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేసే ఉద్దేశం తమకు లేదని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు సాయిరూప్..
మూడు ప్రధాన అంశాల ఆధారంగా ‘ఊరు–వాడ’..
* మొదటిది ‘సేవతో యువ జాగృతి’. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి ఉపయోగపడేలా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. సేవ అంటే కేవలం అన్నదానం, రక్తదానం మాత్రమే కాదని, సమాజానికి ఉపయోగపడే ఏ మంచి పని చేసినా అది సేవేనని పేర్కొన్నారు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
* రెండో అంశం ‘మన ఊరు – మన బాధ్యత’ అని తెలిపారు సాయి రూప్.. గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, స్థానిక ప్రజల సహకారంతో వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా రైతు సదస్సులు నిర్వహించి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
* మూడో అంశం ‘ఊరి మాట పాలకుల దాకా’ అని సాయి రూప్ తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమం పనిచేస్తుందని చెప్పారు. ప్రజల గొంతుకను పాలకులకు వినిపించడం కూడా తమ సేవా కార్యక్రమంలో భాగమేనని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ అభిమానులు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అలాంటి సేవలను మరెవ్వరూ చేయలేదని సాయి రూప్ అన్నారు. తాము కూడా ఎన్టీఆర్ నాటిన సేవా భావానికి కొనసాగింపుగా వచ్చిన ఒక చిన్న విత్తనమేనని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల తమపై ‘వంద కోట్ల మోసం’, ‘అభిమానుల ముసుగులో దందా’ వంటి ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్న సాయి రూప్, ‘ఊరు–వాడ’ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని ఒక గ్రామం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తిగా సేవా దృక్పథంతోనే కొనసాగుతుందని, సమాజాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్.
తాజావార్తలు
-
Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
-
Ramayana: చైనాలో కొత్త టైటిల్తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!
-
Electric Scooter Features: మీ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయా? చాలామంది రైడర్లకు తెలియవు!
-
Bigg Boss Telugu Season10:’బిగ్ బాస్10′ తెలుగు సీజన్ కు నాగ్ గ్రాండ్ ఎంట్రీ.. 10 సర్ప్రైజ్లతో కొత్త సీజన్, ప్రోమో వైరల్!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!