Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tirumala Vaikunta Dwara Dharshanam Divotees Must Have Aadhar Card

Tirumala: భక్తులకు అలర్ట్.. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠద్వార దర్శనం

Published Date :December 3, 2022 , 1:55 pm
By Ramesh Nalam
Tirumala: భక్తులకు అలర్ట్.. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠద్వార దర్శనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. పది రోజుల పాటు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు.. ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తులకు దర్శనం టోకెన్‌లను తిరుపతిలో 9 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం ద్వారా జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రోజుకు 50వేల చొప్పున వైకుంఠ ఏకాదశి టోకెన్‌లను జారీ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో తిరుమల స్థానికులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవాణి టిక్కెట్లను ఆన్ లైన్ విధానంలో రోజుకు 2 వేల చొప్పున టిక్కెట్లు జారీ చేస్తామని.. మహాలఘు విధానంలో దర్శనానికి అనుమతిస్తామన్నారు. పది రోజులు పాటు ఆఫ్ లైన్ విధానంలో శ్రీవాణి టిక్కెట్ల జారీని నిలిపివేస్తామన్నారు. పది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని.. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు.

Also Read

  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
  • CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
  • Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!

Read Also: Andhra Pradesh: ఈనెల 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’

తిరుమలలో డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం సమయాన్ని మార్పు చేశామని.. దీంతో ఉ.9:30 గంటలకే సర్వదర్శనం భక్తులకు నేరుగా దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ మార్పుపై మూడు రోజుల్లోనే అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి ప్రతి నిత్యం వెయ్యి మంది భక్తులకు ఉచిత రవాణ సౌకర్యం కల్పించి వైకుంఠ ద్వారదర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 2న స్వర్ణ రథం, 3వ తేదీన చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహిస్తామని.. వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ కలిగిన భక్తులు 24 గంటలు ముందుగా మాత్రమే తిరుమలకు రావాలన్నారు. దర్శన టిక్కెట్‌లో కేటాయించిన సమయానికి అరగంట ముందుగా మాత్రమే క్యూ లైనులోకి అనుమతిస్తామని తెలిపారు. జనవరి 2వ తేదీ వేకువజామున 1:40 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం ప్రారంభిస్తామని.. వీఐపీలను కేవలం లఘు దర్శనానికి పరిమితం చేస్తామన్నారు. ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనిమతిస్తామని ధర్మారెడ్డి చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • dharma reddy
  • tirumala
  • ttd
  • Vaikunta Dwara Darshanam

తాజావార్తలు

  • West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..

  • Babar Azam: కోహ్లీకి బాబర్ ఆజం షాక్.. సొంత దేశం అభిమానులే ఏకిపారేస్తున్నారు!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..

  • Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ను రూ. 15,000 తక్కువకే కొనండి!

  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions