Tirumala: భక్తులకు అలర్ట్.. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠద్వార దర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. పది రోజుల పాటు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు.. ఆన్లైన్ విధానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తులకు దర్శనం టోకెన్లను తిరుపతిలో 9 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం ద్వారా జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రోజుకు 50వేల చొప్పున వైకుంఠ ఏకాదశి టోకెన్లను జారీ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలో ఏర్పాటు చేసిన కౌంటర్లో తిరుమల స్థానికులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవాణి టిక్కెట్లను ఆన్ లైన్ విధానంలో రోజుకు 2 వేల చొప్పున టిక్కెట్లు జారీ చేస్తామని.. మహాలఘు విధానంలో దర్శనానికి అనుమతిస్తామన్నారు. పది రోజులు పాటు ఆఫ్ లైన్ విధానంలో శ్రీవాణి టిక్కెట్ల జారీని నిలిపివేస్తామన్నారు. పది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని.. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
Read Also: Andhra Pradesh: ఈనెల 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’
తిరుమలలో డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం సమయాన్ని మార్పు చేశామని.. దీంతో ఉ.9:30 గంటలకే సర్వదర్శనం భక్తులకు నేరుగా దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ మార్పుపై మూడు రోజుల్లోనే అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి ప్రతి నిత్యం వెయ్యి మంది భక్తులకు ఉచిత రవాణ సౌకర్యం కల్పించి వైకుంఠ ద్వారదర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 2న స్వర్ణ రథం, 3వ తేదీన చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహిస్తామని.. వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ కలిగిన భక్తులు 24 గంటలు ముందుగా మాత్రమే తిరుమలకు రావాలన్నారు. దర్శన టిక్కెట్లో కేటాయించిన సమయానికి అరగంట ముందుగా మాత్రమే క్యూ లైనులోకి అనుమతిస్తామని తెలిపారు. జనవరి 2వ తేదీ వేకువజామున 1:40 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం ప్రారంభిస్తామని.. వీఐపీలను కేవలం లఘు దర్శనానికి పరిమితం చేస్తామన్నారు. ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనిమతిస్తామని ధర్మారెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!