Vaikunta Dwara Darshan 2025: వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష.. భక్తులకు కీలక సూచనలు
- ఈ నెల 10వ తేదీ నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం..
- 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ..
- ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaikunta Dwara Darshan 2025: ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు ఈవో శ్యామలరావు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 10వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు.. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు ఈవో.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఊరేగింపు నిర్వహిస్తామని.. అటు తరువాత ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవమూర్తులు భక్తులుకు దర్శనం ఇస్తారన్నారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం భక్తులకు మూడు రోజులకు సంభందించిన లక్షా 20 వేల టోకేన్లు జారీ చేస్తామని వెల్లడించారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే క్యూ లైన్ వద్దకు చేరుకోవాలని సూచించారు.
Read Also: Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..
Also Read
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
మొత్తంగా 10 రోజుల వ్యవధిలో 7 లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు టీటీడీ ఈవో శ్వామలరావు.. ఇప్పటికే లక్షా 40 వేల టోకేన్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఆన్ లైన్ విధానంలో కేటాయించామని.. ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు 4.32 లక్షల టోకెన్లు జారీ చేస్తామన్నారు. జనవరి 9వ తేదీన దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ వుండదని స్పష్టం చేశారు.. శ్రీవారి మెట్టు నడకదారిలో 10 రోజులు పాటు టోకెన్లు జారీ వుండదన్నారు. 10 రోజులు పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తామని.. భక్తుల సౌకర్యార్థం 12 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు..
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!