Vaikunta Dwara Darshan 2025: వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష.. భక్తులకు కీలక సూచనలు
- ఈ నెల 10వ తేదీ నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం..
- 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ..
- ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaikunta Dwara Darshan 2025: ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు ఈవో శ్యామలరావు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 10వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు.. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు ఈవో.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఊరేగింపు నిర్వహిస్తామని.. అటు తరువాత ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవమూర్తులు భక్తులుకు దర్శనం ఇస్తారన్నారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం భక్తులకు మూడు రోజులకు సంభందించిన లక్షా 20 వేల టోకేన్లు జారీ చేస్తామని వెల్లడించారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే క్యూ లైన్ వద్దకు చేరుకోవాలని సూచించారు.
Read Also: Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
మొత్తంగా 10 రోజుల వ్యవధిలో 7 లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు టీటీడీ ఈవో శ్వామలరావు.. ఇప్పటికే లక్షా 40 వేల టోకేన్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఆన్ లైన్ విధానంలో కేటాయించామని.. ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు 4.32 లక్షల టోకెన్లు జారీ చేస్తామన్నారు. జనవరి 9వ తేదీన దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ వుండదని స్పష్టం చేశారు.. శ్రీవారి మెట్టు నడకదారిలో 10 రోజులు పాటు టోకెన్లు జారీ వుండదన్నారు. 10 రోజులు పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తామని.. భక్తుల సౌకర్యార్థం 12 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు..
తాజావార్తలు
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?