Kakinada Tension: కాకినాడలో టెన్షన్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానస్పదంగా మృతి చెందడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి 48 గంటలు దాటిపోవస్తున్నా ఇంకా పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. సుబ్రహ్మణ్యం హత్య పట్ల కాకినాడ పట్టణంలో పలు పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. టీడీపీ నిజనిర్దారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు,ఎం.ఎస్ రాజు, పీతల సుజాత ,
పిల్లి మాణిక్యాలరావు వున్నారు. వీరు కాకినాడ చేరుకోవడం పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం దళితుల మీద దాడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ పై అనర్హత వేటు వేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. ఘటనపై సి బీ ఐ విచారణ చేయాలి. ఎమ్మెల్సీ బోగస్ సర్టిఫికెట్ పొంది పదవి పొందాడు. మన్యం ప్రాంతాన్ని దోచుకుంటున్నాడు. 302 కింద కేసు పెట్టి అనంత బాబు ను అరెస్ట్ చేయాలి. దళితుడిని హత్య చేశాడన్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం ఒంటిపై గాయాలున్నాయని సోదరుడు నవీన్ తెలిపారు. ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
ఏ ధైర్యంతో డ్రైవర్ సుబ్మహ్మణ్యాన్ని చంపి కారులో తీసుకు వచ్చాడు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి జవహర్. అనంత బాబు ను పదవి నుండి తప్పించాలి. జాతీయ స్థాయి లో ఈ విషయాన్ని తీసుకు వెళ్తామన్నారు. టీడీపీ నేత ఎం ఎస్ రాజు మాట్లాడుతూ.. కాకినాడ రౌడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మృతుడు కుటుంబంతో రెండు కోట్లు ఇస్తామని బేర సారాలు చేస్తున్నాడు. యాక్సిడెంట్ గా ఒప్పుకోమని చెప్తున్నాడన్నారు. సెక్షన్ 174 ను 302 గా మార్చాలని, అనంత బాబు ను వెంటనే అరెస్ట్ చేయాలి. పోస్ట్ మార్డం జరగాలంటే ఎఫ్ ఐ ఆర్ లో సెక్షన్ లు మార్చాలి. పోలీసులకు అనంత బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ ముద్దాయిలకు కొమ్ము కాస్తుందన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. మేము ఎంత వరుకు అయినా వెళ్తామన్నారు. ముద్దాయిని కాపాడ్డానికి పోలీసులు రాజకీయాలు చేస్తున్నారు. మరో వైపు పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తోపులాటలో టీడీపీ నేత ఎంఎస్ రాజుకి అస్వస్థత కలిగింది. ఆయన్ని ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.డీఎస్పీ అప్పారావు కొట్టాడు అంటున్నారు టీడీపీ నేతలు.
అనంతబాబుని సీఎం ఎందుకు కాపాడుతున్నారని, ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు.
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!