Amaravati Maha Padayatra: పాదయాత్రలో ఉద్రిక్తత.. 3 రాజధానులు కావాలని వైసీపీ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం రోజులుగా అమరావతి రైతుల మహా పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసైనికులు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ,దళిత సంఘ నాయకులు..రైతులు వామపక్ష నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. వందలాదిగా తరలివచ్చిన వీరమహిళలు,రైతులు ,అభిమానులు అమరావతి రైతులకు అండగా బ్రహ్మరథం పడుతున్నారు. రంగురంగుల బెలూన్లతో పాదయాత్ర జరిగే రోడ్ల వెంట అమరావతి రైతులు నినాదాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి చేరుకుంది అమరావతి రైతుల మహా పాదయాత్ర. అయితంపూడి గ్రామంలో నిరసన చేసేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధం అయ్యాయి. దీంతో అమరావతి మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల పాదయాత్రలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ నేతలు మధ్య తోపులాట జరిగింది. ఒకే రాజధాని అంటూ టీడీపీ నేతలు మూడు రాజధానులు కావాలని వైసీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. MLC అంగర రామ్మోహనరావు కాళ్ళు మొక్కి మరీ 3 రాజధానులు కావాలని నిరసన వ్యక్తం చేశాడో వైస్సార్సీపీ కార్యకర్త.
టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగడంతో పాదయాత్ర ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా వుంటే.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఇరగవరం మండలంలో రోడ్డు పొడవునా వైసీపీ(YCP) భారీస్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ తణుకు నియోజకవర్గ వైస్సార్సీపీ నేతలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళలు కూడా నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
తాజావార్తలు
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!