Booster Dose: ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Booster Dose: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ చైనాను గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాక్సిన్కు డిమాండ్ ఏర్పడింది. 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 23.8 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ జాబితాలో 47.6 శాతంతో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది. ఈ విషయం స్వయంగా మంత్రి హరీష్రావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 46.3 శాతంతో రెండో స్థానంలో నిలవడం విశేషం.
Read Also: Afghanistan: మహిళా ఉద్యోగులపై నిషేధం.. తాలిబాన్ పాలకుల తాజా ఆదేశాలు
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ తీసుకున్న రాష్ట్రాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్ (41.7 శాతం) మూడో స్థానంలో, ఒడిశా (40.6 శాతం) నాలుగో స్థానంలో, గుజరాత్ (36.9 శాతం) ఐదో స్థానంలో, ఛత్తీస్గఢ్ (38.3 శాతం) ఆరో స్థానంలో, ఉత్తరప్రదేశ్ (30.4 శాతం) ఏడో స్థానంలో, ఉత్తరాఖండ్ (27.4 శాతం) 8వ స్థానంలో, మధ్యప్రదేశ్ (24.8 శాతం) 9వ స్థానంలో, ఢిల్లీ (22.3 శాతం) పదో స్థానంలో ఉన్నాయి.
కాగా బూస్టర్ డోసు వేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలవడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్రావు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఇందులో దాగి ఉందన్నారు. కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. చైనా సహా పలు దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవడం అవసరమని.. రాష్ట్రాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. త్వరలో అవసరమైనన్ని డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.
బూస్టర్ డోసు వేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలవడం సంతోషం. సీఎం కేసీఆర్ గారి ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఇందులో దాగి ఉంది. కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుంది 1/2 pic.twitter.com/kTv9OIoCdV
— Harish Rao Thanneeru (@BRSHarish) December 24, 2022
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?