Tammineni Sitaram: చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సవాల్.. ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పండి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Sitaram: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు 14 ఏళ్లు పాలించిన టీడీపీ ఏం చేసిందో.. గత మూడేళ్లలో తాము ఏం చేశామో చర్చకు సిద్ధమని.. టీడీపీ సిద్ధంగా ఉందా అని తమ్మినేని ప్రశ్నించారు. గుడ్డిగా విమర్శిస్తున్న వారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఎవరు ఎలాంటివారో అప్పుడు అచ్చెన్నాయుడికి దద్దమ్మలెవరో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ చర్చకు అచ్చెన్నాయుడి లాంటి పానకంలో పుడకలు వద్దన్నారు. డైరెక్టుగా చంద్రబాబుకే సవాల్ విసురుతున్నట్లు తమ్మినేని తెలిపారు.
పేర్లు మార్చిన ఘనత టీడీపీదే అని.. తన దగ్గర చాంతాండంత లిస్ట్ ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్గా మార్చలేదా.. అప్పుడే ఎందుకు మాట్లాడలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఆముదాలవలస నియోజకవర్గానికి సీఎం జగన్ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కేటాయించారని తమ్మినేని సీతారాం ప్రశంసలు కురిపించారు. రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు , వెటర్నరీ పాలిటెక్నిక్, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీని వ్యవసాయ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు రేపు ప్రారంభం చేయనున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
Read Also:Tollywood: ఈ వారం డబ్బింగ్ సినిమాలదే సందడి!
అంతకుముందు ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ నీతిమాలిన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో రోజు రోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీబీఐ, ఈడీ కేసులు, కోర్టుల చివాట్లు, అధికార పార్టీ నేతల అవినీతిపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి చర్యలు సమాజానికి చేటు అన్నారు. వైసీపీ నీతిమాలిన చర్యలకు తెలుగు దేశం కార్యకర్తలు, నేతలు ఎవరూ ప్రభావితం కావొద్దని పిలుపునిచ్చారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలను, పతనమైన ఆలోచనలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తమ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా…ప్రజాస్వామ్య పద్ధతిలోనే టీడీపీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతలు తమ వైఖరి మార్చుకోకపోతే రాజకీయాల్లో ఉండే అర్హతను సైతం కోల్పోతారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!