Dharmana Prasada Rao: పేదలకు మంచి వైద్యం అందించేందుకే జగన్ మెడికల్ కాలేజీలు తెచ్చారు..
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తుంది..
- ఏపీలో పేదలకు మెరుగైన వైద్యం అందించడం లేదన్న మాజీ మంత్రి..
- పేదలకు మంచి వైద్యం అందించేందుకే జగన్ మెడికల్ కాలేజీలు తెచ్చారు: ధర్మాన ప్రసాద్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకుంటాం అంటే ఎలా?.. 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం.. కాలేజీతో పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంది.. గవర్నమెంట్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికే చూస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు.. కావాలంటే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తే వాస్తవాలు తెలుస్తాయి.. ప్రజల కష్టాల నుంచి దోపిడీ చేయాలనుకుంటున్నారు.. విద్య , ఆరోగ్యం ప్రజలకు చాలా అవసరం.. వైద్యం కోసమే మధ్య తరగతి కుటుంబాలు అప్పుల పాలైతున్నాయి.. కూటమి ప్రభుత్వ విధానాలు ఘోరమైన తప్పిదం.. కరోనాతో చాలా కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి.. వైద్య ఖర్చులు భరించలే , అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవి.. అందుకే నాడు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలు తీసుకొచ్చారు.. నేడు ఆరోగ్య శ్రీ అంటే గౌరవం లేకుండా చేశారని ప్రసాద్ రావు ఆరోపించారు.
Read Also: Maganti Sunitha: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
ఇక, కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ని డైల్యూట్ చేస్తుందని మాజీ మంత్రి ప్రసాద్ రావు అన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎంబీబీఎస్ సీటు కోసం ఖర్చు చేసిన విద్యార్థులు డాక్టర్ అయ్యాక ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు. ఉద్దానం కిడ్నీ వ్యాధితో బాధపడేవారిని రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకున్నారు.. వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు చేసి, మంచి నీరు, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కట్టించాం.. వైద్యం కోసం టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్యులు కుటుంబాలకు ఆరోగ్యం పొందే అవకాశం లేదా?.. స్వతంత్రం వచ్చిన 76 ఏళ్ల తరువాత కూడా గిరిజన ప్రాంతాలలో మెడికల్ కాలేజీ అందుబాటులో లేదు.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పోరాటం చేస్తాం, ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచేస్తున్నాయి.. చచ్చిపోయిన తరువాత కూడా వైద్యం చేస్తూ దోపిడే చేస్తున్నారని ప్రసాద్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
-
Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?